Aditya L1: తుది దశకు చేరుకున్న ఆదిత్య ఎల్1

Aditya L1: తుది దశకు చేరుకున్న ఆదిత్య ఎల్1
జనవరి 7న ఎల్‌1 కక్షలోకి

సూర్యుడి గుట్టు విప్పేందుకు ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘ఆదిత్య ఎల్‌1’ తుది దశకు చేరుకొన్నదని, వచ్చే ఏడాది జవనరి 7న లాగ్రాంజియన్‌ పాయింట్‌(ఎల్‌1) కక్షలోకి చేరుకొనే అవకాశం ఉన్నదని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ వెల్లడించారు. మొదటి సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగించి 60 ఏండ్లు అయిన సందర్భంగా శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆదిత్య ఎల్‌1 విజయవంతంగా ముందుకు సాగుతున్నదని, ఎల్‌1 పాయింట్‌లోకి ప్రవేశించేందుకు అవసరమైన చివరి ప్రక్రియ ప్రస్తుతం జరుగుతున్నదని చెప్పారు.

చంద్రయాన్ - 3 తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో మిషన్ ఆదిత్య. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య మిషన్ ను ఇస్రో చేపట్టింది. ఆదిత్య ఎల్-1 ప్రయాణం తుది దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. జనవరి 7 కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్-1 పాయింట్ కు చేరుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం తుది ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. మొదటి సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగించి 60 ఏండ్లు అయిన సందర్భంగా శనివారం తిరువనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆదిత్య ఎల్‌1 విజయవంతంగా ముందుకు సాగుతున్నదని, ఎల్‌1 పాయింట్‌లోకి ప్రవేశించేందుకు అవసరమైన చివరి ప్రక్రియ ప్రస్తుతం జరుగుతున్నదని చెప్పారు.


సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యునికి సమీపంలో ఉన్న ఎల్-1 పాయింట్ ను చేరుకునే లక్ష్యంతో దీన్ని ప్రయోగించారు. ఎల్-1 పాయింట్ నుంచి సూర్యుడి చిత్రాలను తీసి భూమికి పంపించనుంది. సూర్యుడిపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఇవి ఇస్రోకు ఉపయోగపడనున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story