IIT-BHU: ఐఐటీ విద్యార్థినిపై వేధింపులు.. పార్టీ నుంచి ముగ్గురు బీజేపీ కార్యకర్తల బహిష్కరణ

IIT-BHU: ఐఐటీ విద్యార్థినిపై వేధింపులు.. పార్టీ నుంచి ముగ్గురు బీజేపీ కార్యకర్తల బహిష్కరణ
త్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఘటన

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో రెండునెలల క్రితం జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థినిపై ముగ్గురు బీజేపీ కార్యకర్తలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేశారు. దీంతో వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ వారణాసి జిల్లా అధ్యక్షుడు హన్సరాజ్ విశ్వకర్మ తెలిపారు. అయితే, వారి హోదాను కానీ, పార్టీలో వారి పాత్ర గురించి మాత్రం కానీ వెల్లడించలేదు. నిందితులను కునాల్ పాండే, ఆనంద్ అలియాస్ అభిషేక్ చౌహాన్, సాక్షం పటేల్‌గా గుర్తించి వారణాసి పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. కోర్టు వారికి ఈ నెల 14 వరకు రిమాండ్ విధించింది.

ఐఐటీ-బనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థిని నవంబరు 2 తెల్లవారుజామున లైంగిక వేధింపులకు గురైంది. బైక్‌పై వచ్చిన నిందితులు క్యాంపస్‌లోనే ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. నిందితులు ఆమె దుస్తులు విప్పి ఆ ఘటనను వీడియో తీశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐఐటీ-బీహెచ్‌యూ విద్యార్థి సంఘం ఆందోళనలు చేసింది. బాధితురాలికి న్యాయం కావాలని డిమాండ్ చేసింది. క్యాంపస్‌లో భద్రత పెంచాలని ఆందోళనకు దిగారు. ఈ ఘటన యూపీలో రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బీజేపీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. నిందితులకు పార్టీ అండగా నిలుస్తోందని ఆరోపించారు.


ఐఐటీ-బీహెచ్‌యూలో ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి సంబంధించి అరెస్టయిన ముగ్గురు బీజేపీ కార్యకర్తల్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు వారణాసి జిల్లా బీజేపీ నాయకుడు ఆదివారం ప్రకటించారు. విద్యార్థినిపై వేధింపుల ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపింది. నిందితులు బీజేపీ కార్యకర్తలు అయినందు వల్లే ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని, వారిని రక్షించే పని చేస్తున్నదని ప్రతిపక్ష సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. నవంబర్‌ 2న ముగ్గురు వ్యక్తులు ఐఐటీ-బనారస్‌ హిందూ వర్సిటీ విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డారు. వర్సిటీ క్యాంపస్‌లో బైక్‌పై వచ్చిన నిందితులు ఓ విద్యార్థిని బట్టలు విప్పి, వేధింపులకు పాల్పడ్డారు. దారుణాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. ఈ ఘటనతో వర్సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాడిని నిరసిస్తూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో భద్రతను పెంచాలని డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story