Karnataka : లోక్‌సభ ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన ప్రముఖులు

Karnataka :  లోక్‌సభ ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన ప్రముఖులు
నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్‌ 19 చివరి రోజు..

మే 7న కర్ణాటకలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి మాజీ సీఎం బసవరాజు బొమ్మై, భాజపా నేత ప్రహ్లాద్‌ జోషి, సినీనటుడు శివరాజ్‌కుమార్‌ భార్య గీతా శివరాజ్‌కుమార్‌లతో పాటు పలువురు ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు.

ముందుగా తన తల్లిదండ్రుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించిన బొమ్మై అనంతరం మాజీ మంత్ర BC పాటిల్‌, పార్టీ కార్యక్రర్తలతో కలిసి...తన నామినేషన్‌ను ఎన్నికల అధికారులకు సమర్పించారు. భాజపా సీనియర్‌ నేతలు BS యడియూరప్ప, మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌లతో కలిసి రోడ్‌ షో నిర్వహించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ ధార్వాడ్‌ తరఫున భాజపా అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. కేంద్ర సహాయ మంత్రి భగ్‌వంత్‌ ఖుబ బీదర్‌ నుంచి....మాజీ సీఎం దివంగత S బంగారప్ప కూతురు గీతా శివరాజ్‌కుమార్‌ షిమోంగా నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. వీరితో పాటు పలువురు ప్రముఖలు సైతం నామ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. రెండో దశలో 28 లోక్‌సభ స్థానాలకు గాను 14 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు చేయడానికి ఏప్రిల్‌ 19 చివరి రోజు..20నఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు.

అంతకుముందు రోజు ఆయన రోడ్ షోలో తన తల్లి, సీనియర్ మంత్రి సతీష్ జార్కిహోళి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. తమ పత్రాలను దాఖలు చేసిన ఇతర అభ్యర్థులలో చిక్కోడి నుండి తిరిగి ఎన్నికను కోరుతున్న బిజెపి ఎంపి అన్నాసాహెబ్ శంకర్ జోల్లె మరియు దావణగెరె నుండి ఆ పార్టీ ఎంపి జిఎం సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వర ఉన్నారు. రెండో దశలో 28 లోక్‌సభ స్థానాలకు గానూ 14 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, నామినేషన్ల దాఖలుకు ఏప్రిల్ 19 చివరి రోజు. ఏప్రిల్ 20న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, పత్రాల ఉపసంహరణకు ఏప్రిల్ 22 చివరి రోజు. మొదటి దశలో, 14 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి.




Tags

Read MoreRead Less
Next Story