Bullet train station : దేశంలోనే తొలి బుల్లెట్​ ట్రైన్​ స్టేషన్​.. అదిరిపోలా ?

Bullet train station : దేశంలోనే తొలి బుల్లెట్​ ట్రైన్​ స్టేషన్​.. అదిరిపోలా ?
అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లో బుల్లెట్ రైలు స్టేషన్

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి తొలి బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా తొలి బుల్లెట్‌ రైలు కోసం నిర్మించిన స్టేషన్ వీడియోను కేంద్ర మంత్రి షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సబర్మతి మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కారిడార్‌ హబ్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించారు. దేశంలోనే తొలిసారి చేపట్టిన హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణంలో భాగంగా ఈ స్టేషన్‌ నిర్మాణం చేపట్టారు. అత్యాధునిక సదుపాయాలతో ఈ స్టేషన్‌ను నిర్మించినట్లు స్పష్టమవుతోంది.

బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌ను జంట భవనాలుగా రూపొందించారు. స్టేషన్‌కు అవతల గోడలపై ఉప్పు సత్యాగ్రహం సన్నివేశాలకు సంబంధించిన భారీ చిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్‌ను మొత్తం 1,33,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్‌లో ఆఫీస్‌లు, వాణిజ్య కార్యాలయాలు, రిటైల్‌ స్టోర్లు ఏర్పాటు చేసుకొనే విధంగా నిర్మించారు.కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వణి వైష్ణవ్​ షేర్​ చేసిన ఒక వీడియో.. ఇప్పుడు సోషల్​ మీడియాను షేక్​ చేస్తోంది. గుజరాత్​ అహ్మదాబాద్​లోని సబర్మతి మల్టీమోడల్​ ట్రాన్స్​పోర్ట్​ హబ్​ వద్ద సిద్ధమవుతున్న తొలి బుల్లెట్​ రైల్వే స్టేషన్​కి సంబంధించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్ కారిడార్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దేశంలోని రెండు ఆర్థిక నగరాలను కలుపుతున్న ఈ రైలు మార్గం 508 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ మార్గంలో 26 కిలోమీటర్ల మేర సొరంగాలు, 10 కిలోమీటర్ల మేర వంతెనలు, ఏడు కిలోమీటర్లు మేర కరకట్టలు ఉన్నాయి.

ఇక, అహ్మదాబాద్‌లోని బుల్లెట్ రైలు స్టేషన్ విషయానికి వస్తే మొత్తం 1.33 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. హబ్ భవనంలో కార్యాలయాలు, వాణిజ్య కేంద్రాలు, ప్రయాణికుల కోసం రిటైల్ అవుట్‌లెట్లతో జంట నిర్మాణాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ పూర్తయితే.. ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రయాణం 2 గంటల్లోనే పూర్తవుతుంది. ఈ రైలు గరిష్టంగా గంటలకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇక ఈ బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రధాని మోదీ, అప్పటి జపాన్‌ పీఎం షింజో అబేల మధ్య 2017లో ఒప్పందం కుదిరింది. ఈ బుల్లెట్‌ ట్రైన్​ ప్రాజెక్ట్​ కోసం రూ. 1.08 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Tags

Read MoreRead Less
Next Story