Charger scam: మొబైల్ ఛార్జర్ల వినియోగంపై కేంద్రం హెచ్చరికలు

Charger scam:  మొబైల్ ఛార్జర్ల వినియోగంపై కేంద్రం హెచ్చరికలు
బహిరంగ ప్రదేశాల్లోని చార్జింగ్ పోర్టులతో జ్యూస్ జాకింగ్ ప్రమాదం

మొబైల్ ఛార్జర్ల విషయంలో పౌరులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. భారతదేశంలో USB ఛార్జర్ స్కామ్ ప్రబలంగా ఉందని కేంద్రం హెచ్చిరించింది. విమానాశ్రయాలు, కేఫ్‌లు, హోటళ్లు, బస్టాండ్‌లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ పోర్టల్‌లను ఉపయోగించవద్దని కేంద్రం సూచించింది.

చార్జింగ్ పాయింట్లకు అనుసంధానమైన ఫోన్లలో మాల్‌వేర్, ఇతర ప్రమాదకర సాఫ్ట్‌వేర్లను యూజర్‌కు తెలీకుండా ఇన్‌స్టాల్ చేసి, డేటా దొంగిలించడమే జ్యూస్ జాకింగ్. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అవగాహనా రాహిత్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని కేంద్రం పేర్కొంది. బహిరంగ చార్జింగ్ పోర్టులను వాడేవారికి డేటా తస్కరణ రిస్కుతో పాటూ నిందితులు ఈ సమాచారంతో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కొన్ని కీలక సూచనలు చేసింది.

జ్యూస్ జాకింగ్ నుంచి తప్పించుకోవాలంటే..

చార్జింగ్ పాయింట్లకు బదులు సాధారణ విద్యుత్ పాయింట్ల ద్వారా చార్జింగ్ చేసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో వాడుకునేందుకు నిత్యం పవర్ బ్యాంక్, లేదా ఇతర చార్జింగ్ సాధనాలు రెడీ చేసుకోవాలి

డివైస్‌ను ఎప్పుడూ లాక్ చేసి పెట్టుకోవాలి. స్మార్ట్ ఫోన్‌ను పిన్ లేదా ఇతర విధానాల్లో తెరిచేలా ఏర్పాటు చేసుకోవాలి. పెద్దగా పరిచయం లేని చోట్ల ఉన్న చార్జింగ్ పాయింట్లను వాడకపోవడమే మంచిది. వీలైనంత వరకూ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫ్ చేశాకే చార్జింగ్ చేయాలి.

సైబర్ దాడులు జరిగిన సందర్భాల్లో 1930 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలి. ప్రభుత్వ వెబ్‌సైట్ www.cybercrime.gov.in ను సందర్శించి కూడా వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story