Attack with Geometry Compass: 4వ తరగతి చిన్నారిపై తోటి విద్యార్థుల దాడి!

Attack with Geometry Compass: 4వ తరగతి చిన్నారిపై తోటి విద్యార్థుల దాడి!
కంపాస్‌తో 108 సార్లు పొడిచి పొడిచి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. ఓ చిన్న గొడవ వల్ల నాలగో తరగతి చదువుతున్న ఓ బాలుడిపై తోటి విద్యార్థులు వృత్తలేఖినితో 108 సార్లు పొడవడం కలకలం రేపింది. ఈనెల 24న ఏరోడ్రోమ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధిత విద్యార్థి తండ్రి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన కొడుకు గాయాలతో పాఠశాల నుంచి ఇంటికి వచ్చాడని ఆ తండ్రి వాపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించామని తెలిపారు. గొడవ కారణంగా ముగ్గురు విద్యార్థులు తన కొడుకును వృత్తలేఖినితో పొడిచారని చెప్పారు. అయితే ఈ ఘటనపై బాలల సంక్షేమ కమిటీ ఛైర్‌పర్సన్‌ పల్లవి పోర్వాల్ స్పందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలంటూ పోలీసులను ఆదేశాలు జారీ చేశారు. అలాగే విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో తాజాగా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు స్కూల్లో నాలుగో తరగతి బాలుడు ఆరాధ్య పాండేపై ముగ్గురు తోటి విద్యార్థులు దాడి చేశారు. జామెట్రీ కంపాస్‌తో ఏకంగా 108 సార్లు పొడిచారు. ఎయిరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 24న ఈ ఘటన జరిగింది. దాడి విషయం స్కూల్ ప్రిన్సిపాల్‌కు చెప్పేందుకు భయపడ్డ బాధిత విద్యార్థి ఇంటికొచ్చాక తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అయితే విషయం ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరాధ్య పాండే తండ్రి ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీ కోరినా ఇవ్వలేదని పేర్కొన్నారు. చివరకు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల మధ్య చిన్న గొడవ అనూహ్యంగా ఈ దాడికి కారణమైందని తెలుస్తోంది. కాగా, బాలుడికి వైద్య పరీక్షలు జరిగాయని, అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. విద్యార్థులందరూ 10 ఏళ్ల లోపు వారేనని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ ఉదంతంపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా దృష్టి సారించింది. త్వరలో పిల్లలు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. వీడియో గేమ్స్‌లోని హింసాత్మక దృశ్యాల ప్రభావం పిల్లలపై పడిందా? అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story