Punjab: కాంగ్రెస్ నేతను కాల్చివేసిన ఖలిస్థానీలు

Punjab: కాంగ్రెస్ నేతను  కాల్చివేసిన  ఖలిస్థానీలు
తామే చంపామంటూ ఫేస్‌బుక్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది ప్రకటన

పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఓ స్థానిక కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బల్జీందర్ సింగ్ బల్లీ ఇంట్లోకి ప్రవేశించి ఆయనను కాల్చి చంపారు. డాలా గ్రామంలోని బల్జీందర్ ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డైంది. బల్జీందర్ అజిత్వాల్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడిగా ఉన్నారు.

అయితే ఈ హత్యకు కెనడాకు చెందిన ఖలిస్తాన్ ఉగ్రవాది అర్ష్ డల్లా బాధ్యత తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఆయన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు పెట్టాడు. బల్జిందర్ సింగ్ బల్లి తనను గ్యాంగ్‌స్టర్ సంస్కృతిలోకి నెట్టాడని డల్లా తన పోస్ట్‌లో ఆరోపించారు. తన తల్లి పోలీసు కస్టడీ వెనుక కాంగ్రెస్ నాయకుడి హస్తం ఉందని, ఇది తనను ప్రతీకారం తీర్చుకునేలా ప్రేరేపించిందని ఆయన పేర్కొన్నారు.


కాగా ఉగ్రవాది అర్ష్ దల్లా.. లిస్టెడ్ టెర్రరిస్ట్ అండ్‌ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉగ్ర సంస్థలో గత మూడు, నాలుగేళ్లుగా చురుగ్గా పాల్గొంటున్నాడు. కెనడా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అర్ష్‌ దల్లా పంజాబ్‌లో జరిగిన పలు ఉగ్రవాద హత్యలకు పాల్పడ్డాడు. అర్ష్ డల్లా భారత్ టెర్రరిస్టుగా గుర్తించింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అతని కోసం గాలిస్తోంది.

హత్య జరిగే సమయంలో బల్జిందర్ సింగ్ తన ఇంట్లో హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు, ఏవో పత్రాలపై సంతకాలు చేయాలని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అభ్యర్థన రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు బల్లిపై కాల్పులు జరిపి హతమార్చారు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బల్లి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Tags

Read MoreRead Less
Next Story