Cyclone Hamoon: ఈ ఉదయం తుపానుగా మారిన హమూన్.

Cyclone Hamoon: ఈ ఉదయం తుపానుగా మారిన హమూన్.
ఏడు రాష్ట్రాలకు హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి ‘హమూన్‌’గా పేరు పెట్టారు. ఈ పేరును ఇరాన్‌ సూచించింది. హమూన్‌ తుపాను కారణంగా భారత తీరంపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేసింది. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు ఒడిశాలోని పారాదీప్‌కు 230 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని ధిగాకు 360 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్‌లోని హెపుపరాకు 510 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో హమూన్ తుపాను ఈశాన్యం దిశగా కదలడం ప్రారంభమైందని, 6 గంటలకు తీవ్ర తుపానుగా మారిందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.


రాబోయే 12 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఈ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అక్టోబర్‌ 25న బంగ్లాదేశ్‌లోని హెపుపరా, చిట్టగాంగ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తుపాను కారణంగా రాబోయే రెండ్రోజుల్లో ఒడిశాలో ఓ మోస్తరు వర్షపాతం నమోదు కావొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. గాలులు కూడా వీస్తాయని పేర్కొన్నారు. తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఒడిశా ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఒడిశాపై నేరుగా ప్రభావం ఉండనప్పటికీ.. జాలర్లు ఎవరూ బుధవారం వరకు వేటకెళ్లొద్దని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు సూచించారు. తుపాను నేప‌థ్యంలో ఒడిశా ప్ర‌భుత్వం జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. తీర ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది. అటు పశ్చిమ బెంగాల్‌లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్థానిక వాతావరణ విభాగం వెల్లడించింది. ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల దూరంలో వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వివరించింది. బుధవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.




Tags

Read MoreRead Less
Next Story