Uttarakhand: ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం

Uttarakhand:  ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం
48 గంటల్లో రెండో సారి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 48 గంటల్లో రెండోసారి భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.2 గా ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. తెల్లవారుజామున 3.49 గంటలకు భూప్రకంపనలు సంభవించగా, భూకంప కేంద్రం 5 కిలోమీటర్లుగా నమోదైంది. ఈ విషయాన్ని ఎన్ సీఎస్ ఎక్స్ (ట్విట్టర్) వేధికగా వెల్లడించింది. ఉత్తరకాశీకి 33 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.

48 గంటల వ్యవధిలో రాష్ట్రంలో నమోదైన రెండో భూకంపం ఇది. ఈ భూకంపానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. పితోర్ గఢ్ లో మంగళవారం 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు ఇదే రోజు నేపాల్ లో వరుసగా నాలుగు భూకంపాలు సంభవించాయి. ఉత్తరాఖండ్ లోని పుణ్యక్షేత్రమైన జోషిమఠ్ కు ఆగ్నేయంగా 206 కిలోమీటర్ల దూరంలో, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 284 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.


ఢిల్లీ ఎన్సీఆర్, పంజాబ్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈ భూకంపం ప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం 2:25 గంటలకు పశ్చిమ నేపాల్ లో 10 కిలోమీటర్ల లోతులో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో నేపాల్ భూకంపాల పరంపర మొదలైందని ఎన్ సీఎస్ అధికారి ఒకరు తెలిపారు.

ఇక నేపాల్ విషయానికి వస్తే పశ్చిమ నేపాల్‌లో మధ్యాహ్నం 2:25 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తర్వాత మధ్యాహ్నం 2:51 గంటలకు 6.2 తీవ్రతతో మరోసారి కుదుపు నమోదైంది. ఆ తర్వాత అదే ప్రాంతంలో మధ్యాహ్నం 3:06 గంటలకు, 3:19 గంటలకు వరుసగా 15 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.6, 3.1 తీవ్రతతో మరో రెండు భూ ప్రకంపనలు సంభవించాయి.

Tags

Read MoreRead Less
Next Story