Train on Fire : న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

Train on Fire : న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
తప్పించుకోవడం కోసం రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు

న్యూఢిల్లీ నుంచి బీహర్‌లోని దర్భంగా వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన కొందరు ప్రయాణాకులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి కిందకు దూకారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ-దర్భంగా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని స్లీపర్‌ కోచ్‌ నుంచి పొగలు రావడాన్ని సరాయ్ భూపత్ స్టేషన్ మాస్టర్‌ గమనించారు. వెంటనే లోకోపైలట్‌ను అలెర్ట్‌ చేసి రైలును ఆపించారు. ఆ కోచ్‌లో మంటలు చెలరేగడంతో అందులోని ప్రయాణికులు కిందకు దూకారు.

వరుస రైలు ప్రమాద ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇటావా దగ్గర రైలులో మంటలు చెలరేగగా.. మూడు బోగీలు దగ్ధం అయ్యాయి. యూపీలోని ఇటావా సమీపంలోని సరాయ్ భూపత్ స్టేషన్‌ దగ్గరలో బుధవారం సాయంత్రం వేళ ఈ ఘటన జరిగనట్లు రైల్వే అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్.సరాయ్ భూపత్ స్టేషన్‌ దాటిపోతున్న క్రమంలో స్లీపర్ కోచ్ నుంచి అకస్మాత్తుగా పొగలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన స్టేషన్ మాస్టర్.. వెంటనే ట్రైన్ పైలట్, గార్డ్‌కు సమాచారం అందించాడు. దీంతో దీంతో రైలును అక్కడికక్కడే నిలిపేశాడు.

ట్రైన్ ఆపగానే ప్రయాణికులందరూ ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు పేర్కొన్నారు. రైలుకు పూర్తి స్థాయిలో మంటలు అంటుకోగా.. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.


Tags

Read MoreRead Less
Next Story