Uttara Pradesh: డాల్ఫిన్ తిని జైలు పాలయ్యారు..

Uttara Pradesh: డాల్ఫిన్ తిని జైలు పాలయ్యారు..
అవగాహన లేకపోవడం కారణమంటున్న మత్స్యకారులు

డాల్ఫిన్ ను తిన్నారన్న ఆరోపణలపై నలుగురు మత్స్యకారులపై పోలీసులు కేసునమోదు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నసీర్ పూర్ లో జరిగింది. యమునా నదిలో నలుగురు మత్స్యకారులు సోమవారం వేటకు వెళ్లగా వారికి డాల్ఫిన్ చిక్కింది. దానిని తమ భుజంపై మోసుకుని ఇంటికి తీసుకెళ్లారు. వీరిని పలువురు వీడియోలో బంధించారు. సదరు వీడియో వైరల్ అయింది. సోమవారం చైల్ ఫారెస్ట్ రేంజర్ రవీంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసునమోదు చేశారు. మత్స్యకారుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

నసీర్‌పూర్ గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు జూలై 22న ఉదయం యమునా నదిలో చేపలు పట్టే సమయంలో డాల్ఫిన్ వలలో చిక్కుకుందని పిప్రి ఎస్‌హెచ్‌ఓ శ్రవణ్ కుమార్ సింగ్ తెలిపారు. వారు నది నుండి డాల్ఫిన్‌ను బయటకు తీసుకువచ్చి, దానిని తమ భుజంపై ఒక ఇంటికి తీసుకువెళ్లి, అక్కడ వారు దానిని వండుకుని తిన్నారు, సింగ్ చెప్పారు. డాల్ఫిన్ ను తీసుకువెళ్తుండగా... ఫారెస్ట్ రేంజర్, స్థానికులు వీడియో తీసినట్లు పోలీసులు తెలిపారు. అటవీశాఖ అధికారి ఫిర్యాదు మేరకు రంజీత్ కుమార్, సంజయ్, దీవన్, బాబాలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. రంజీత్ కుమార్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నామని, మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story