Guwahati : ఆత్మహత్య చేసుకునే వ్యక్తిని కాపాడిన పోలీసు..!
By - Vijayanand |29 April 2023 12:50 PM GMT
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడాడు ఓ పోలీసు. ఈ ఘటన అస్సాంలోని గౌహతీలో జరిగింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరుగగా లేటుగా వెలుగులోకి వచ్చింది. గౌహతీలోని సరైఘాట్ వంతెనపై నుంచి బ్రహ్మపుత్ర నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ వ్యక్తి బ్యరేజ్ గేటుపై కూర్చున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే జనం గుమిగూడి ఉన్నారు. ఆత్మహత్య చేసుకునే వ్యక్తిని బ్యారేజ్ గేటుపై నుంచి బయటకు రమ్మంటే ఎంతకూ రాలేదు. దీంతో లంకేశ్వర్ కలిత్ అనే పోలీసు గుంపు మధ్యలోనుంచి డ్యామ్ పైకి ఎక్కాడు. గేటుపై నుంచి సదరు వ్యక్తి కూర్చున్న గేటుపైకి అతిజాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్లాడు. ఏమాత్రం కాలుజారినా సదరు వ్యక్తికంటే ముందే డ్యామ్ లో పడిపోయేవాడు పోలీసు. అలాంటి పరిస్థితిలోకూడా సదరు లంకేశ్వర్ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి అతన్ని పట్టుకున్నాడు. ఆతర్వాత సదరు వ్యక్తిని పైకి లాక్కువచ్చాడు. తన ప్రాణాలను లెక్కచేయకుండా ఓ వ్యక్తిని కాపాడినందుకు లంకేశ్వర్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com