Haryana : 50 మంది బాలికలపై లైంగిక వేధింపులు

Haryana : 50 మంది బాలికలపై లైంగిక వేధింపులు
కీచక ప్రిన్సిపాల్ అరెస్ట్

హర్యానాలోని జింద్‌లో పాఠశాల ప్రిన్సిపాల్‌ 50 మందికి పైగా బాలికలు లైంగిక వేధింపులకు(sexual harassment) పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టయ్యారు. జింద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 50 మందికి పైగా బాలికలు ప్రిన్సిపాల్ వారితో అసభ్యకరంగా ప్రవర్తించారని హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ శుక్రవారం తెలిపింది. అయితే ఈ ఫిర్యాదుల పట్ల పోలీసుల అలసత్వంపై కూడా మహిళా కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

పాఠశాలలోని కొంతమంది విద్యార్థినుల ఫిర్యాదులను తాము సెప్టెంబర్ 14న పోలీసులకు పంపామని, పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నిందితులు తప్పించుకునేందుకు సమయం దొరికిందని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కూడా ఏర్పాటు చేశారు.

సెప్టెంబర్ 14న విద్యార్థినుల నుంచి ప్రిన్సిపాల్‌పై రాతపూర్వకంగా 60 ఫిర్యాదులు అందాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు భాటియా తెలిపారు. వాటిలో 50 ఫిర్యాదులు నిందితుడి చేతిలో శారీరక వేధింపులకు గురైన బాలికలవేనని , మిగతా పది మంది బాలికలు ప్రిన్సిపాల్ ఇలాంటి పనులు చేసేవాడని తమకు తెలుసని తమ ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. . అయితే అక్టోబర్ 30న చాలా ఆలస్యంగా పోలీసులు చర్యలు తీసుకున్నారని కమిషన్ తెలిపింది. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే నిందితుడిని అరెస్టు చేయకపోవడంతోనే అతను తప్పించుకోవడానికి సమయం దొరికిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రభుత్వం ప్రిన్సిపాల్‌ను వెనువెంటనే సస్పెండ్‌ చేసింది. నిందితుడిని పట్టుకునేందుకు జింద్ పోలీసులు బృందాలను ఏర్పాటు చేసి గాలించి ఎట్టకేళకు అతనిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి మద్దతిచ్చిన మహిళా ఉపాధ్యాయురాలి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ప్రిన్సిపాల్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 354-A , 341, 342 , లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడం (POCSO) చట్టాల కింద కింద కేసు నమోదు చేశారు.


Tags

Read MoreRead Less
Next Story