Delhi: ఢిల్లీలో స్కూళ్లకు మరో ఐదురోజులు శీతాకాల సెలవులు

Delhi:  ఢిల్లీలో స్కూళ్లకు మరో ఐదురోజులు శీతాకాల సెలవులు
విద్యాశాఖ మంత్రి ఉత్తర్వులు జారీ

దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు శీతాకాల సెలవులను ప్రభుత్వం మరో ఐదురోజులు పొడిగించింది. చలితీవ్రత తగ్గకపోవడం, చల్లని గాలులు వీస్తుండటంతో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు సెలవులను ఈ నెల 12 వరకు వరకు పొడిగించినట్లు విద్యాశాఖ మంత్రి అతిశి సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం నుంచి పాఠశాలలు తెరచుకోవాల్సి ఉన్నది. ఢిల్లీలో చలి తీవ్రత అధికంగా ఉన్నది. పొగమంచు కారణంగా విజబిలిటీ చాలా తక్కువగా ఉన్నది. పగటిపూట సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటున్నది. దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. దీంతో శీతాకాలపు సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది.

కాగా, జనవరి 10 వరకు పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖ డైరెక్టర్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దానిని వెంటనే ఉపసంహరించుకున్నారు. పొరపాటు జరిగిందని, సెలవుల పొడిగింపుపై ఆదివారం తుది నిర్ణయం తీసుకోనున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story