Covid-19 cases: కొత్తగా 841 మందికి కరోనా..

Covid-19 cases: కొత్తగా 841 మందికి కరోనా..
7నెలల్లో ఇదే అత్యధికం ,4 వేలు దాటిన యాక్టివ్ కేసులు

కరోనా కేసులు దేశంలో భారీగా పెరగడం ఆందోళన కగిలిస్తోంది. కొత్త సబ్ వేరియంట్ బయటపడడంతో వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 841 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,309 కు చేరింది. దేశంలో గత 24 గంటల్లో 841కొత్త కోవిడ్ -19కేసులు నమోదయ్యాయి. గత 227రోజులు లేదా ఏడు నెలల్లో ఇన్ని కేసులు ఒక్క రోజే నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కి పెరిగింది. వైరస్ కారణంగా కొత్తగా మూడు మరణాలు నమోదయ్యాయి. కేరళ, కర్ణాటక, బిహార్‌లో ఒకరు చొప్పున మరణించారు. దేశంలో 2020లో కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4.50 కోట్ల (4,50,13,272) కేసులు, నమోదయ్యాయి. ఇటీవలి కేసుల పెరుగుదల ఉన్నప్పటికీ.. యొక్క రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 220.67కోట్ల మందికి కోవిడ్ -19వ్యాక్సిన్‌లను అందిచారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంనూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాపించడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కోవిడ్ -19 నిబంధనలను పాటించాలని ప్రజలను కోరారు. అనారోగ్య సమస్యలు ఉన్న వారు, వృద్ధులు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, ఫేస్ మాస్క్‌లు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. JN.1 సబ్-వేరియంట్‌కు సంబంధించి 178 కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాల్లో వెలుగుచూసింది. గోవాలో అత్యధికంగా 47 కేసులు, కేరళలో 41 కేసులు నమోదయ్యాయి.

కేరళలో ఈ వైరస్ బాధితులను వైద్యాధికారులు గుర్తించారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల్లో ఎక్కువ శాతం కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ వల్లే కేసులు పెరుగుతుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుని వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story