ISRO: 30న పీఎస్‌ఎల్‌వీ సీ–56 ప్రయోగం

ISRO: 30న పీఎస్‌ఎల్‌వీ సీ–56 ప్రయోగం
ఒకేసారి నింగిని చేరనున్న ఏడు ఉపగ్రహాలు

ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-3 ప్రయోగం తర్వాత మరో భారీ ప్రయోగానికి సిద్ధం అవుతోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న ఉదయం 6.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ–56 ప్రయోగాన్ని నిర్వహించనున్నామని షార్‌ వర్గాలు తెలిపాయి. చంద్రయాన్-3 మిషన్‌ను ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత, ఇస్రో తన తదుపరి భారీ ప్రయోగానికి సంబంధించిన ఒక అప్‌డేట్‌ ఇచ్చింది.. భారత అంతరిక్ష సంస్థ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C56) మిషన్‌ను ఈ నెలలోనే ప్రయోగిస్తామని ప్రకటించింది. అయితే చంద్రయాన్‌–3 మిషన్‌ను లూనార్‌ ఆర్బిట్‌లోకి పంపే ప్రక్రియలో ఇస్రో శాస్త్రవేత్తలంతా నిమగ్నమై ఉండడంతో ఈ ప్రయోగపు తేదీ ని ఈ 30కి పొడిగించారు.


ఈ ప్రయోగంలో 422 కిలోలు బరువు కలిగిన సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. గత ఏప్రిల్ లో విజయవంతంగా ప్రయోగించిన PSLV-C55 మిషన్ లాగానే ఇది కూడా కాన్ఫిగర్ చేయబడింది.23.58 కిలోలు బరువు కలిగిన ఆర్కేడ్, 23 కేజీల వెలాక్స్‌–ఏఎం, 12.8 కిలోలు బరువు కలిగిన ఓఆర్‌బీ–12 స్ట్రైడర్, 3.84 కేజీల బరువున్న గలాసియా–2, 4.1 కేజీల బరువైన స్కూబ్‌–11, 3.05 కేజీల నులయన్‌ అనే ఉపగ్రహాలను లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం సింగపూర్, ఇజ్రాయిల్ దేశాలకు చెందిన పూర్తి వాణిజ్యపరమైంది కావడం విశేషం. వీటిలో 351 కిలోల డీఎస్‌–షార్ట్‌ ఫర్‌ సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌ అనే ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్ అన్నింటికంటే ముఖ్యమైనది.

జూలై 14, 2023న చంద్రయాన్-3 చంద్రుని మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన తర్వాత ఈ రాబోయే మిషన్ ఇదే. జులై 30వ తేదీన 6.30 గంటలకు శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి ఈ ప్రయోగం చేయనున్నట్టు ఇస్త్రో ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story