BS Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు

BS Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు
మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులు..

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్​ నేత బీఎస్​ యడియూరప్పపై పోక్సో కేసు నమోదైంది! శుక్రవారం తెల్లవారుజామున.. కర్ణాటక సదాశివనగర్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లిన ఓ మహిళ.. యడియూరప్పపై పోక్సో కేసు వేసినట్టు సమాచారం. ఫిబ్రవరి 2న ఓ చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తన 17 ఏండ్ల కుమార్తెతో కలిసి యడియూరప్ప దగ్గరకు వెళ్లామని, ఆ సమయంలో లైంగిక దాడి జరిగనట్లు బాలిక తల్లి అందులో పేర్కొన్నారు. అయితే ఈ విషయమై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందిచంలేదు.

కాగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయనపై ఈ ఆరోపణలు రావడం సర్వత్రా చర్చ జరుగుతున్నది. 2008-2011 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018లో కొద్ది రోజుల పాటు, ఆ తర్వాత జూలై 2019-2021 మధ్య మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2021, జులైలో బీజేపీ అధిష్టానం యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం ఆయన కుమారుడు విజయేంద్ర యడియూరప్ప రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story