Karnataka: బెంగళూరులో కలరా కలకలం

Karnataka: బెంగళూరులో కలరా కలకలం
50శాతం పెరిగిన కేసులు

కర్ణాటకలో మళ్లీ కలరా కలకలం రేగింది. బెంగళూరు మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు(బీఎంసీఆర్‌ఐ) చెందిన ఇద్దరు విద్యార్థులకు కలరా పాజిటివ్‌ తేలిందని అధికారులు ఆదివారం వెల్లడించారు. డయేరియా, డీహైడ్రేషన్‌ వంటి కారణాలతో దవాఖానలో చేరిన 47 మంది విద్యార్థుల్లో వీరిద్దరు ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఇతరులకు కలరా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించింది. బీఎంసీఆర్‌ఐ హాస్టల్‌ కిచెన్‌ను మూసివేసి, డిస్‌ఇన్‌ఫెక్షన్‌ చర్యలు చేపట్టారు. పెస్ట్‌ కంట్రోల్‌ చర్యలు కూడా తీసుకొంటున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది రాష్ట్రంలో ఆరు కలరా కేసులు నమోదయ్యాయని, వాటిలో ఐదు ఒక్క మార్చి నెలలోనే రిపోర్టు అయ్యాయని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొన్నది.

అసలే ఎండాకాలం..తాగటానికి కూడా నీళ్లు లేక జనం అల్లాడిపోతున్నారు.గత కొన్ని రోజులుగా బెంగళూరులో నీటి కొరత ప్రజలను వేధిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో బెంగళూరు నగరాన్ని మరో మహమ్మారి అటాక్ చేసింది.. బెంగళూరులో భారీగా కలరా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఏప్రిల్4న మల్లేశ్వరం ప్రాంతంలోకొత్తగా కలరా కేసు నమోదు అయ్యింది.అదే ప్రాంతంలో మరో రెండు కేసులు పరీక్షల కోసం పంపారు. గత కొద్దిరోజులుగా కలరా కేసులు 50 శాతం పెరిగాయి. సగటున రోజుకు కనీసం 20 కేసులు పెరుగుతున్నాయని బెంగళూరులోని స్పర్ష్ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట రాలజిస్ట్ లు చెబుతున్నారు. నగరంలో పారిశుధ్య లోపం,కలుషిత నీటి వల్ల కలరా కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు అంటున్నారు.

బెంగళూరు నగరంలో తీవ్రమైన నీటి కొరత కారణంగా నీటి నాణ్యత లోపించి, నీటి ద్వారా వ్యాపించే కలరా వ్యాధి పెరుగుదలకు కారణమవుతోంది. కలరా వ్యాప్తితో బృహత్ బెంగళూరు మెట్రోపాలిటన్ అధికారులు అప్రమత్త మయ్యారు. కలరా వ్యాప్తి జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

కలరా అనేది టాక్సిజెనిక్ బాక్టీరియం విబ్రియో కలరాతో ప్రేగుతో ఇన్ ఫెక్షన్ వల్ల కలిగే తీవ్రమైన అతిసార వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.3 మిలియన్ల నుంచి 4 మిలియన్ల మంది ప్రజలు కలరా బారిన పడుతున్నారని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) చెబుతోంది.

Tags

Read MoreRead Less
Next Story