Mamata Banerjee: రండి శాంతి స్థాపిద్దాం..

Mamata Banerjee: రండి శాంతి స్థాపిద్దాం..
మణిపుర్‌ ప్రజలకు మమతా బెనర్జీ పిలుపు.... మానవత్వంతో ముందడుగు వేయాలని విజ్ఞప్తి

జాతుల మధ్య కలహాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న మణిపుర్‌(Manipur)లో శాంతి స్థాపనకు ముందుకు రావాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ((Mamata Banerjee) ప్రజలకు పిలుపునిచ్చారు. మానవత్వం కోసం ముందడుగు వేయాలని మణిపుర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మణిపుర్‌లో వెలుగుచూస్తున్న హృదయ విదారక ఘటనలు తన మనసును కలచివేస్తున్నాయని మమత అన్నారు. ద్వేషాన్ని వదిలిపెట్టి.. అందరం కలిసి శాంతి కోసం ముందడుగు వేద్దాం రండంటూ విజ్ఞప్తి చేశారు.

అధికారంలో ఉన్నవారు మౌనంగా ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ గాయాలకు ఉపశమనం కలిగిస్తుందని మమత అన్నారు. మానవత్వాన్ని మళ్లీ తట్టి లేపేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, తామంతా మీకు మద్దతుగా నిలబడతామని ప్రకటించారు.

మణిపుర్‌లో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు( india leaders) రెండు రోజుల పాటు పర్యటించారు. మణిపుర్‌ గవర్నర్‌ అనసూయ ఉయికే‍( Governor Anusuiya Uikey)తో సమావేశమై ఆమెకు మెమోరాండం సమర్పించారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను ఆమెకు వివరించారు. మణిపుర్‌ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పని చేయాలని గవర్నర్ అనసూయ ఉయికే ఎంపీలకు సూచించారు.

మణిపుర్‌కు అఖిలపక్ష బృందాన్ని పంపి అన్ని వర్గాల నేతలతో చర్చలు జరపాలని గవర్నర్‌ తమకు సూచించారని కాంగ్రెస్( Congress) లోక్‌సభ పక్షనేత అధీర్ రంజన్ ఛౌదరి( Congress MP Adhir Ranjan Chowdhury) తెలిపారు. మణిపుర్‌ ప్రజలు లేవనెత్తిన సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. మణిపుర్‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండకడతామని అధీర్‌ రంజన్‌ చౌదరీ వ్యాఖ్యానించారు. తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అంగీకరించి మణిపుర్‌ అంశంపై చర్చ చేపట్టాలని అధీర్ రంజన్ ఛౌదరీ విజ్ఞప్తి చేశారు.

మణిపుర్‌(Manipur )లో జాతుల మధ్య ఘర్షణలు దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయని ప్రతిపక్ష ఎంపీ(21 MPs)లు అన్నారు. కేంద్రం కూడా ఇక్కడికి ప్రతినిధి బృందాన్ని పంపాలని డిమాండ్‌ చేశారు. మణిపుర్‌ సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకే తాము క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు ప్రతిపక్షాల కూటమి ఇండియా ఫ్రంట్‌కు చెందిన ఎంపీలు స్పష్టం చేశారు. అన్ని పార్టీలు శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించాలనికాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి సూచించారు. హింసకు ముగింపు పలికి శాంతి స్థాపన జరగాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

Tags

Read MoreRead Less
Next Story