Gold Jewellery Robbed: ఒక్కడే.. 25 కేజీల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లాడు.

Gold Jewellery Robbed: ఒక్కడే..   25 కేజీల వజ్రాభరణాలు ఎత్తుకెళ్లాడు.
జోస్ అలుక్కాస్‌లో భారీ చోరీ..

తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రముఖ బంగారం షోరూమ్‌లో భారీ చోరీ జరిగింది. ఒక్కడే షాపంతా కలియతిరిగి కిలోల కొద్దీ బంగారాన్ని లూటీ చేశాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో నిక్షిప్తమయ్యాయి.

కోయంబత్తూర్‌ లోని గాంధీపురం ప్రాంతంలో ఉన్న జోస్‌ అలూక్కాస్‌ లో ఈ దొంగతనం జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి దుకాణంలోకి చొరబడ్డాడు. ఆ తర్వాత షోరూమ్‌ మొత్తం కలియతిరిగాడు. నచ్చిన బంగారాన్ని తన వెంట తెచ్చుకున్న సంచిలోకి నింపుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మార్గంలోనే ఎంచక్కా బయటకు వెళ్లిపోయాడు.

ఉదయం షోరూమ్ తెరిచిన సిబ్బంది దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. షో రూమ్ నుంచి సుమారు 25 కేజీల బంగారం, వజ్రాభరణాలు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన క్లూస్‌ టీమ్‌.. వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. దొంగతనానికి పాల్పడింది ఒక్కడే అని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ దొంగ కోసం గాలింపు చేపడుతున్నారు.

తమిళనాడులోని కోయంబత్తూరులో భారీ దొంగతనం జరిగింది. ఇక్కడి గాంధీపురంలో ఉన్నజోస్ అలుక్కాస్ బంగారు దుకాణంలోకి సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చొరబడిన దుండగుడు తీరిగ్గా దొంగతనం చేశాడు. వినియోగదారుడిలా షాపంతా తిరుగుతూ నచ్చిన ఆభరణాలను వెంట తెచ్చిన సంచిలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మార్గం నుంచే ఎంచక్కా వెళ్లిపోయాడు. ఇదంతా మొత్తం షాపులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది

ఉదయం షో రూమ్ తెరిచిన సిబ్బంది దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 25 కిలోల నగలు మాయమైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. వేలిముద్రలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగతనం చేసింది ఒకడేనని గుర్తించారు. గతంలో షోరూములో పనిచేసిన వ్యక్తి కానీ, లేదంటే షోరూము గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగానీ ఈ చోరీకి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story