Delhi High Court: మహిళ నడవడికపై తప్పుడు ఆరోపణలు కూడా క్రూరత్వమే

Delhi High Court: మహిళ నడవడికపై తప్పుడు ఆరోపణలు కూడా క్రూరత్వమే
విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

భార్యాభర్తల విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళ నడవడికపై అభాండాలు వేయడంకన్నా ఎక్కువ క్రూరత్వం మరొకటి లేదంది. తప్పుడు ఆరోపణలు మానసిక క్రూరత్వమేనని స్పష్టం చేసింది. మానసిక క్రూరత్వాన్ని ఏ ఒక్క పారామీటర్ ఆధారంగా నిర్వచించలేమని కోర్టు పేర్కొంది. దీన్ని నిర్ధారించడానికి భార్యాభర్తల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఈ కారణంతో విడాకులు ఇవ్వలేమన్న ఫ్యామిలీ కోర్టు తీర్పును పక్కన పెట్టి ఢిల్లీ మహిళకు డైవోర్స్ మంజూరు చేసింది.

ఢిల్లీకి చెందిన ఓ మహిళ విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన భర్త ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందానని, ఉద్యోగం చేస్తూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నానని చెప్పి తనను పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. అయితే అవన్నీ అబద్ధాలేనని పెళ్లయ్యాక తెలిసిందని చెప్పింది. భర్తకు స్థిరమైన ఉద్యోగం లేదని, పెళ్లికి ముందునుంచే తాను ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని వివరించింది. భర్తకు ఉద్యోగం లేకున్నా సర్దుకుపోయానని, కానీ ఉద్యోగానికి వెళ్లే తనకు ఇతరులతో అక్రమ సంబంధం అంటగడుతూ వేధిస్తుండడం భరించలేకపోయానని తెలిపింది. 1989లో వివాహం కాగా 1996 నుంచి అంటే 27 ఏళ్లుగా విడిగా ఉంటున్నానని, మానసికంగా వేధిస్తున్న భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరింది. అయితే, భార్య ప్రవర్తనపై తప్పుడు ఆరోపణలు మానసిక వేధింపుల కిందికి రావని, ఈ కారణంతో విడాకులు మంజూరు చేయలేమని ఫ్యామిలీ కోర్టు తీర్పిచ్చింది.

కేసును స్వీకరించిన హైకోర్ట్ జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం మాట్లాడుతూ “ఈ కేసులో భార్య పని చేయడం, భర్త పని చేయకపోవడం వల్ల మానసిక వేదనను సులభంగా అర్థం చేసుకోవచ్చు. భార్యాభర్తల ఆర్థిక పరిస్థితిలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. అందువల్ల.. తనను తాను కాపాడుకోవడానికి భర్త చేసిన ప్రయత్నాలు ఖచ్చితంగా విఫలమయ్యాయనీ, ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహిళ హైకోర్టును ఆశ్రయించిందని తెలిపింది.

ఈ కేసులో క్రూరత్వం, విడిచిపెట్టిన కారణంగా విడాకుల కోసం ఆమె చేసిన దరఖాస్తు తిరస్కరించబడింది. తన భర్త తన దగ్గరి బంధువుతో పాటు మరికొందరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తనపై ఆరోపణలు చేయడం ప్రారంభించాడని మహిళ తన పిటిషన్‌లో పేర్కొంది. భర్త వేసిన ఈ అపవాదుపై హైకోర్టు.. ‘స్త్రీ పాత్రను దూషించడం కంటే దారుణం మరొకటి ఉండదు’ అని వ్యాఖ్యానించింది. ఆమె భర్త చేష్టలు మానసిక వేధింపుల కిందికే వస్తాయని పేర్కొంటూ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.



Tags

Read MoreRead Less
Next Story