దక్షిణాది నుంచి మోదీ పోటీ..!?

దక్షిణాది నుంచి మోదీ పోటీ..!?

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ దక్షిణాది నుంచి పోటీ చేయనున్నారా? ప్రస్తుతం ఇదే అంశంపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో, బీజేపీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీజేపీ దక్షిణ మిషన్‌లో భాగంగా.. మోదీ దక్షిణాది రాష్ట్రాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రత్యేకించి తమిళనాడు నుంచి పోటీకి అవకాశంలున్నాయంటూ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ.. వచ్చే లోకసభ ఎన్నికల్లో వారణాసితో పాటు.. తమిళనాడులోని కన్యాకుమారి లేదా కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన రాహుల్‌ గాంధీ.. దక్షిణాది నుంచి గెలుపొందారు. కర్ణాటక ఫలితాల తర్వాత దక్షిణాదిపై కాంగ్రెస్‌ మరింత ఫోకస్ పెట్టిన నేపథ్యంలో.. దీనికి కౌంటర్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. మోదీ దక్షిణాదిలోనూ పోటీ చేస్తే పార్టీకి ఉపయోగమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story