మోదీ నెల జీతం రెండు లక్షలు. అందులో ఎక్కువ భాగాన్ని..

మోదీ నెల జీతం రెండు లక్షలు. అందులో ఎక్కువ భాగాన్ని..
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తుల విలువ జూన్‌ 30, 2020 నాటికి 2.85 కోట్ల రూపాయలుగా తేలింది. ప్రధాని కార్యాలయానికి ఇటీవల సమర్పించిన నివేదికలో తనకు..

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తుల విలువ జూన్‌ 30, 2020 నాటికి 2.85 కోట్ల రూపాయలుగా తేలింది. ప్రధాని కార్యాలయానికి ఇటీవల సమర్పించిన నివేదికలో తనకు సంబంధించిన ఆస్తుల వివరాలను మోదీ పొందుపరిచారు. జూన్‌ నెల ముగిసేనాటికి మోదీ వద్ద 31వేల 450 రూపాయల నగదు ఉండగా, ఎస్బీఐ గాంధీనగర్‌ ఎన్‌ఎస్‌సీ శాఖకు చెందిన బ్యాంకు ఖాతాలో 3లక్షల 38వేల173 రూపాయలు ఉన్నాయి. అదే బ్రాంచ్‌లో ఓ ఎఫ్‌డీఆర్‌ కూడా ఉంది. మల్టీ ఆప్షన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో కోటి 60లక్షల28వేల939 రూపాయలు నిల్వ ఉన్నట్లు మోదీ వెల్లడించారు.

నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్స్‌‌ విలువ 8లక్షల43వేల124గా పేర్కొన్నారు. జీవిత బీమా పాలసీల విలువ లక్షా50వేల597 కాగా.. టాక్స్‌ సేవింగ్‌ ఇన్‌ఫ్రా బాండ్ల విలువ 20 వేలు. వీటితో పాటు చరాస్తుల విలువ 1.75 కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించారు. అయితే ఆయనకు ఏ బ్యాంకులోనూ రుణాలు లేవు. సొంత వాహనం కూడా లేదు. ప్రధాని మోదీ వద్ద, సుమారు 45 గ్రాముల బరువు గల నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ లక్షన్నర ఉంటుంది.

గాంధీనగర్‌ సెక్టార్‌-1లో తనకు ఓ ప్లాట్‌ ఉందని మోదీ వెల్లడించారు. 3వేల531 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలంపై ముగ్గురికి సమాన హక్కు ఉందని పేర్కొన్నారు. సుమారు పద్దెనిమిదేళ్ల క్రితం గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడానికి ముందే ఆయన ఈ స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం. అప్పుడు ఆ ప్లాట్‌ విలువ 1.3 లక్షల రూపాయలు. ఇక ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ప్రధాని మోదీ స్థిరాస్తి విలువ 1.10 కోట్లు ఉంటుందని అంచనా.

ఏడాది కాలంలో ఆయన చరాస్తులు 36 లక్షల 53 వేలు పెరిగాయి. ఈ 36 లక్షల 53 వేలు కూడా ఎలా పెరిగాయంటే బ్యాంకు వడ్డీల ద్వారా వచ్చినవే. పొదుపు విషయంలో మోదీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఒక సగటు మనిషి ఎలాగైతే మిగిలిన వేతనంలో కొంత భాగం బ్యాంకుల్లో దాచుకుంటాడో.. మోదీ కూడా అలాగే చేస్తారు. ఈ వివరాలన్నీ స్వయంగా మోదీనే వెల్లడించారు. గత జూన్ 30 నాటికి ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలను మోదీ వెల్లడించడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇక మోదీ నెల జీతం రెండు లక్షలు. అందులో ఎక్కువ భాగాన్ని ఆయన బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తుంటారు. వాటిపై వచ్చే వడ్డీని, నెల నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేస్తుండడం వల్ల చరాస్తులు పెరుగుతూ వస్తున్నాయని ఆయన సన్నిహితులు తెలిపారు. చరాస్థులు పెరుగుతున్నా.. స్థిరాస్తుల విషయంలో మాత్రం తేడా లేదు. పారదర్శకత కోసం ఆస్తులు వెల్లడించడం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం నుంచే మొదలైంది. 2004లో వాజ్‌పేయి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి రాజకీయ నేతలు వారి ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడిస్తూ వస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story