Mukesh Ambani : రిలయన్స్ ముకేశ్ అంబానీకి మరో బెదిరింపు…

Mukesh Ambani : రిలయన్స్ ముకేశ్ అంబానీకి మరో బెదిరింపు…
ఈ సారి ఏకంగా రూ.200 కోట్లు ఇవ్వాలని…

భారతీయ అతి పెద్ద కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి హత్య చేస్తామని బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. డబ్బులు ఇవ్వకుంటే తాము ముకేశ్ అంబానీని హత్య చేస్తామని ఆగంతకులు బెదిరించడం సర్వసాధారణంగా మారింది. ఇప్పటి వరకు పలుసార్లు ముకేశ్ అంబానీకి బెదిరింపులు వచ్చాయి. ముకేశ్ అంబానీ నుంచి ఆగంతకుడు రూ. 200 కోట్లు డిమాండ్ చేశాడు.

అడిగినంత ఇవ్వకపోతే కాల్చి చంపేస్తామని ఆగంతకులు బెదిరించారు. తమవద్ద దేశంలోనే అత్యుత్తమ షూటర్స్‌ ఉన్నారని అందులో పేర్కొన్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయిఅయితే రెండు బెదిరింపు మెయిల్స్‌ ఒకే అకౌంట్‌ నుంచి వచ్చాయని, షాదాబ్ ఖాన్‌ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా అంబానికి ఇలాంటి బెదింపులు వచ్చిన విషయం తెలిసిందే.

ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఫిర్యాదు ఆధారంగా ముంబయిలోని గామ్‌దేవి పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై సెక్షన్‌లు 387, 506(2) కింద కేసు నమోదు చేశారు. ముఖేష్ అంబానీకి హత్య బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది బీహార్‌లోని దర్భంగాకు చెందిన వ్యక్తి ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు చంపేస్తానని బెదిరింపు కాల్స్ చేసినందుకు అరెస్టయ్యాడు. నిరుద్యోగి అయిన నిందితుడిని రాకేష్ కుమార్ మిశ్రాగా గుర్తించారు. ముంబయిలోని సర్‌ హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌ను పేల్చివేస్తానని, ముఖేష్‌ అంబానీ కుటుంబాన్ని బెదిరించాడు. 2021వ సంవత్సరంలో ముఖేష్ అంబానీ దక్షిణ ముంబయి నివాసం యాంటిలియా వెలుపల 20 పేలుడు జెలటిన్ స్టిక్స్, బెదిరింపు లేఖతో కూడిన స్కార్పియో కారును కనుగొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story