Mumbai Crime: మైనర్ బాలుడిని కత్తితో ముక్కలుగా నరికి…

Mumbai Crime: మైనర్ బాలుడిని కత్తితో ముక్కలుగా నరికి…
భార్యను ఇబ్బంది పెట్టినందుకు ఆమె సోదరుడి వంటి బాలుడి హత్య

ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 33 ఏళ్ల ఆటో రిక్షా డ్రైవర్‌ ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా చంపేసి అతని మృతదేహాన్ని 5 ముక్కలుగా నరికేశాడు. ఆ భాగాలను ఎక్కడ పడేయాలో తెలియక ఇంకా ఇంట్లోనే దాచ్చాడు. అయితే ఇంట్లో వస్తున్న దుర్వాసన అని అతని భార్య పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు షఫిక్ షేక్ భార్య తండ్రి వద్ద పెరిగిన ఈశ్వర్ పుత్రన్‌... షేక్ భార్యతో చనువుగా ప్రవర్తిస్తుండటంతో గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో సోమవారం మరోమారు గొడవ జరగడంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన షేక్.. ఈశ్వర్‌ను హత్యచేశాడు. ఆపై శరీరాన్ని ముక్కలు చేసి వంటగదిలో దాచిపెట్టాడు.బాధితుడు కనిపించకపోవడంతో అతడి పెంపుడు తండ్రి లలిత్ పుత్రన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.


చెంబూరులో గుర్రపు షెడ్డు నడుపుతున్న లలిత్‌, అతడి భార్య రేష్మకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. 12 సంవత్సరాల క్రితం ఓ అనాధ బాలుడిని వీరు దత్తత తీసుకున్నారు. ఈశ్వర్ మార్వాడి అన్న అతడి పేరును ఈశ్వర్ పుత్రన్‌గా మార్చారు. నాలుగేళ్ల క్రితం లలిత్ తన కుమార్తెల్లో ఒకరైన అమైరాను షేక్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ తర్వాతి నుంచి షేక్‌కు, ఈశ్వర్‌కు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. షేక్, అమైరా దంపతులకు ఓ చిన్నారి కూడా ఉంది. ఏడాది క్రితం తన భార్య అమైరాతో అసభ్యంగా ప్రవర్తించడం చూసినట్టు నిందితుడు తెలిపాడు. అప్పుడే అతడికి వార్నింగ్ ఇచ్చానని, అయినా తీరు మారకపోవడంతో చంపేశానని పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సబర్బన్ చెంబూర్‌లోని RCF ప్రాంతంలోని MHADA ప్రాంతంలో షేక్ రెండు గదుల ఇంట్లో బాలుడు అవశేషాలు కనుగొన్నారు. షఫీపై గతంలో కూడా ఒక మర్డర్ కేసు ఉంది అయితే ఆ తర్వాత కోర్టు అతను నిర్దోషిగా విడుదల చేసింది.


Tags

Read MoreRead Less
Next Story