Madurai train fire: రైలు కోచ్ లో భారీగా నోట్ల కట్టలు

Madurai train fire: రైలు కోచ్ లో భారీగా నోట్ల కట్టలు
అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు వ్యక్తులు అదృశ్యం

శనివారం తెల్లవారుజామును తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్ లో ఉన్న రైల్లో మంటలు ఎగసిపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. యాత్రికులకోచ్ లో జరిగిన ఈ ప్రమాదం మీద విచారణ జరుగుతుంది. దీనిపై ఆదివారం నాడు ఫోరెన్సిక్ నిపుణులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ పెట్టెలో సగం కాలిన నోట్లు భారీగా బయటపడ్డాయి.

రూ. 500, రూ. 200 నోట్లు కట్టలు ఉన్నట్టు గుర్తించారు. అసలు ఈ డబ్బు ఎవరిది? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ మొత్తాన్ని ట్రావెల్ ఏజెన్సీ వారు యాత్రికుల కోసం మధ్యలో ఖర్చు పెట్టడం కోసం తెచ్చుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు వ్యక్తులు అదృశ్యమయినట్టు పోలీసులు గుర్తించారు. వీరి కోసం ప్రత్యేక బలగాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి, వీరిద్దరికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వంట చెరకు, బంగాళ దుంపలు వంటివి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలిలో దక్షిణ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఏఎం విచారణ చేపట్టారు.


శనివారం ఉదయం మధురై రైల్వే స్టేషన్‌ కి ఒక కిలో మీటర్ దూరంలో ఉండగా.. ఓ ఐఆర్సీటీ స్పెషల్ ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో అగ్ని ప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందారు. సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు తమవెంట తెచ్చుకున్న సిలిండర్ మీద టీ పెట్టడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. రైలు కదులుతుండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

ఈ ఘటన నేపథ్యంలో మండే వస్తువులు, పేలుడు పదార్థాలను రైల్లో తీసుకు వెళ్ళటం చెట్ట రీత్యా నేరమని మరొకసారి దక్షిణ రైలు ఒక ప్రకటన విడుదల చేసింది. 1989 రైల్వే చట్టాన్ని సెక్షన్లు 67, 164, 165 ప్రకారం శిక్షార్హమైనవని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story