Mizoram :ఆధిక్యం జోరం పీపుల్స్ మూవ్ మెంట్

Mizoram :ఆధిక్యం  జోరం పీపుల్స్ మూవ్ మెంట్
అధికార పార్టీకి ఓటమి తప్పదా!

మిజోరంలోని 40 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలతో పాటె ఇక్కడ కూడా ఎన్నికలు జరిగాయి. అయితే, ఓట్ల లెక్కింపు ఇక్కడ సోమవారం జరుగుతోంది. ముందు ఇక్కడ కూడా ఆదివారమే ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉన్నా.. స్థానికంగా వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో సోమవారం నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. దాంతో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన 45 నిమిషాల్లోనే జోరం పీపుల్స్ మూవ్ మెంట్ (జెడ్పీఎం) మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది.

మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తొలు పోస్టల్‌ ఓట్లను లెక్కించగా, ప్రస్తుతం ఈవీఎం ఓట్ల కౌంటింగ్‌ జరుగుతున్నది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం ప్రతిపక్ష జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటికే ఒక చోట గెలుపొందిన జడ్‌పీఎం మరో 25 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇక సీఎం జొరాంతంగా నేతృత్వంలోని అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (జెడ్పీఎం) 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఆరు స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి నవంబర్‌ 7న ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో 80.66 శాతం ఓటింగ్‌ నమోదయింది. మొత్తం 174 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.


జోరం పీపుల్స్ మూవ్ మెంట్ నాయకుడు లాల్దుహోమా. లాల్దుహోమా మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన పార్టీ రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. 2018లో జెడ్పీఎంకు 8 సీట్లు వచ్చాయి. మిజోరాం ఎగ్జిట్ పోల్స్ లో లాల్ దుహోమా పార్టీ జెడ్పీఎం ఆధిక్యం వస్తుందని సూచించాయి. ఈ పార్టీ చీఫ్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సెక్యూరిటీ చీఫ్ గా పనిచేశారు. 1984లో కాంగ్రెస్ లో చేరి ఎంపీ అయ్యారు. అయితే తర్వాత ఆయన కాంగ్రెస్ ను వీడారు. మిజోరంలో 5 ఎగ్జిట్ పోల్స్ లోజోరం పీపుల్స్ మూవ్ మెంట్ (జెడ్పీఎం) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలింది. మిగిలిన 4 సర్వేలు హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనా వేశాయి.

Tags

Read MoreRead Less
Next Story