Narendra Modi: కేంద్రంలో మూడోసారీ మోదీనే..

Narendra Modi: కేంద్రంలో మూడోసారీ మోదీనే..
యూకే ప్రముఖ దినపత్రిక సంచలన కథనం

భారతదేశంలో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ హ్యాట్రిక్ విజయం సాధిస్తారంటోంది యూకే ఆధారిత ది గార్డియన్ దినపత్రిక. భారతదేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి నరేంద్రమోదీ ప్రధానమంత్రి కావడం అనివార్యమని ది గార్డియన్ పత్రిక కథనం రాసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలు, అపార ప్రజాదరణ, అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం వంటి అంశాలు మోదీని మూడోసారి ముఖ్యమంత్రిని చేస్తాయని యూకే పత్రిక తెలిపింది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు బీజేపీ బలం ఉత్సాహం మరింత పెంచాయని హానా ఎల్లిస్ పీటర్స్ అభిప్రాయపడ్డారు. ఈ విజయాల అనంతరం ప్రధాని స్పందిస్తూ హ్యాట్ పక్కా అని పేర్కొనడాన్ని కూడా హానా ఎల్లిస్ తన కాలమ్‌లో ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ వాతావరణాన్ని బట్టి మోదీకి విజయావకాశాలు ఎక్కువని దేశంలో అధికశాతం పరిశీలకులు అభిప్రాయపడుతున్నట్టు తేల్చాచారు. బీజేపీ హిందూ జాతీయవాద ఎజెండాతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న ప్రజాదరణ వల్ల ప్రధాని కావడం అనివార్యమని పత్రిక పేర్కొంది. ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో నిండిపోయిందని వెల్లడించింది.

దక్షిణ, తూర్పు భారతంలో బీజేపీ ప్రత్యర్థులు కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో బలహీనంగా ఉందని యూకే కాలమిస్ట్ హానా ఎల్లిస్ పీటర్స్ స్పష్టం చేశారు. కేవలం మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయన అభిప్రాయం నెలకొందని చెప్పారు. అంతేకాకుండా, బీజేపీ ప్రతిపక్షాల జాతీయ స్థాయి కూటమి ‘ఇండియా’లో కీలక అంశాల్లో ఏకాభిప్రాయం రావాల్సి ఉందని కూడా పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ ఎన్నికల కదనరంగంలోకి దిగిందని, వికసిత భారత సంకల్ప యాత్ర ఇందులో భాగమేనని పేర్కొన్నారు. బీజేపీ విజయాల గురించి గ్రామల వరకూ చేర్చాలని అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. మోదీ పాప్యులారిటీ, సంక్షేమ పథకాలు, హిందుత్వ ఎజెండాతో బీజేపీ వ్యూహాత్మకంగా వెళుతోందని అన్నారు.

ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడిన సమస్యలపై సమిష్ఠి పోరాటం చేయలేకపోయారని కథనం పేర్కొంది. గత 9 ఏళ్లలో బీజేపీ సర్కారు సాధించిన విజయాలను వికసిత భారత్ సంకల్ప్ యాత్రలో ప్రచారం చేస్తున్నారని ది గార్డియన్ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల విజయావకాశాలపై బీజేపీ నమ్మకంగా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా పేర్కొన్నట్లు కాలమ్ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story