Love Story: ఇది ఇన్ స్టా ప్రేమ

Love Story: ఇది ఇన్ స్టా ప్రేమ
కుమార్తెతో భారత్‌కు పోలండ్‌ మహిళ

ప్రేమ నిజమైనదైతే దానిని ఏ సరిహద్దులు ఆపలేవు, మతం, కులం అడ్డురాదు. ఈ మాట నిజమని నిరూపిస్తూ, పోలాండ్‌లో నివసిస్తున్న బార్బరా పోలక్ అనే మహిళ తన ప్రేమికుడు సదాబ్ మాలిక్‌ను వివాహం చేసుకుంది. అనంతరం జార్ఖండ్‌లో అతడిని కలవడానికి హజారీబాగ్ చేరుకుంది. . 45 ఏళ్ల బార్బరా పోలక్ తన ఆరేళ్ల కూతురు అనన్యతో కలిసి వచ్చింది.

ప్రేమించిన వ్యక్తి కోసం తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి పోలండ్‌ నుంచి భారత్‌లోని ఝార్ఖండ్‌కు చేరుకొంది ఓ మహిళ. 2021 సంవత్సరంలో పోలాండ్‌కు చెందిన బార్బరా పోలక్ సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలోని కట్కమ్‌సండి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న షాదాబ్ మాలిక్‌తో స్నేహం చేసింది. ముందు మాటలు తర్వాత మనసులు కలిసాయి. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పోలాక్‌కు ఇప్పటికే వివాహమై.. ఆరేళ్ల కుమార్తె ఉంది. ఇటీవలే ఈమె తన భర్తతో విడాకులు తీసుకుంది.ఇండియాకు వచ్చి తన ప్రేమికుడిని పొందడానికి బార్బరా వీసా కోసం దరఖాస్తు చేసింది. వీసా దొరకగానే ప్రేమికుడి దగ్గరికి కూతురుతో సహా రెక్కలు కట్టుకు వాలింది. కొద్దిరోజుల క్రితమే హజారీబాగ్‌ చేరుకొని షాదాబ్‌ను కలిసింది. ప్రస్తుతం అతడితో కలిసే ఉంటోంది.

అన్నట్టు ప్రేమికురాలు బార్బరా పోలాక్ వయస్సు సుమారు 45 సంవత్సరాలు కాగా , ఆమె ప్రేమికుడు షాదాబ్ మాలిక్ వయస్సు 35 సంవత్సరాలు. అయితే పోలాక్ అక్కడి వాతావరణానికి, ఇక్కడ వాతావరణానికి మధ్య ఉన్న ఇబ్బందులు చాలానే ఫేస్ చేస్తోంది. ఝార్ఖండ్‌ వేడికి తట్టుకోలేకపోవడంతో షాదాబ్‌ వెంటనే ఏసీని ఏర్పాటు చేశాడు. భారత్‌ చాలా అందమైన దేశం అంటున్న పొలాక్ తనను చూసేందుకు రోజూ వస్తున్న వారిని చూసి మురిసిపోతోంది.

అయితే సీమా హైదర్ ఎఫెక్ట్ తో ఇలా దేశాలు దాటిన ప్రేమలన్నీ పోలీసులు దృష్టికి వెళుతున్నాయి. దీంతో హజారీబాగ్‌ డీఎస్పీ రాజీవ్‌కుమార్‌ ఖుత్రా గ్రామానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు.

Tags

Read MoreRead Less
Next Story