Punjab and Haryana HC : ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం!

Punjab and Haryana HC : ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం!
ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం

దేశవ్యాప్తంగా శునకాల దాడులు (Dog bite) విపరీతంగా పెరుగుతుండటం, వాటి నియంత్రణపై చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శునకం దాడి సంబంధించిన కేసులో పంజాబ్-హరియాణా హైకోర్టు (High Court) ఆసక్తికర తీర్పు వెలువరించింది. వీధి శునకాలు, ఇతర జంతువుల దాడి కేసులో పరిహారం చెల్లించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

కుక్కకి ఉన్నంత విస్వాసం మరొక జంతువుకు లేదు అన్న మాట ఎంత నిజమో ఒక్కోసారి అవి మనుషుల ప్రాణాలమీదకు తీసికొస్తాయి అన్నది కూడా అంటే నిజం. మన దేశంలో ఏటా 2 కోట్ల మంది కుక్క కాట్లకు గురవుతున్నారు. ఇందులో 18 వేల నుంచి 20 వేల మంది రేబిస్ వైరస్ బారిన పడి చనిపోతున్నారు. అంతెందుకు దేశంలో రోజు ఎక్కడో ఒక చోట వీధి కుక్కల దాడిలో చిన్నారులు బలి అవుతున్న వార్తలు వస్తూనే ఉంటాయి.తాజాగా వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 49 ఏళ్ల పరాగ్ దేశాయ్ అక్టోబర్‌లో వీది కుక్కలు వెంబడించిన ఘటనలో మరణించారు. వీధికుక్కలు ఆయన్ని వెంబడించగా పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని.. ఆ కారణంగా దేశాయ్ మరణించారని సంబంధిత ఆసుపత్రి ఇటీవల ప్రకటనలో పేర్కొంది.


కుక్క కాటు కేసులపై హర్యానా-పంజాబ్ హైకోర్టు ఇప్పుడు సంచలన తీర్పు వెలువరించింది. పంజాబ్, హర్యానా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో నమోదైన కుక్క కాటు కేసులపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు కోరింది. జంతువుల దాడి కేసుల్లో చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించాలని తీర్పులో స్పష్టం చేసింది. అయితే.. వీది కుక్కలతో పాటు ఆవులు, ఎద్దులు, గాడిదలు, గేదెలు, అడవి, పెంపుడు జంతువులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి

ప్రజలపై వీధి కుక్కల దాడుల నేపథ్యంలో హైకోర్టులో ఏకంగా 193 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన పంజాబ్-హర్యానా హైకోర్టు కుక్క కాటుపై రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. వీధుల్లో శునకాలు, ఇతర జంతువుల దాడిలో పౌరులు గాయపడితే ప్రభుత్వం తప్పక పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. ఎవరైనా ఓ వ్యక్తి కుక్కకాటుకు గురైనప్పుడు ఒక్కో పంటి గాటుకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. గాయం మరింత తీవ్రమైనది అయితే రూ.20 వేల వరకు పరిహారం అందించాలని నిర్దేశించింది. సందర్భాన్ని బట్టి ఈ పరిహారాన్ని ప్రభుత్వ విభాగాల నుంచి, ప్రైవేటు వ్యక్తుల నుంచి రాబట్టే అధికారం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం పేర్కొంది.


Tags

Read MoreRead Less
Next Story