Rahul Gandhi : విద్యార్థిని స్కూటర్‌పై రాహుల్ గాంధీ పిలియన్‌ రైడ్

Rahul Gandhi : విద్యార్థిని స్కూటర్‌పై రాహుల్ గాంధీ పిలియన్‌ రైడ్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సెప్టెంబర్ 23న జైపూర్‌లో విద్యార్థి స్కూటర్‌పై పిలియన్ రైడర్‌గా ప్రయాణించారు. రాహుల్ జైపూర్‌లోని మహారాణి కాలేజీకి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు, బాలికలకు స్కూటర్లు పంపిణీ చేసి, వారితో కాసేపు సంభాషించారు. అనంతరం విద్యార్థినితో కలిసి స్కూటర్‌పై వెళ్లాడు. పిలియన్ రైడర్‌గా ఆయన చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘రాజస్థాన్ మే జన్ నాయక్’ అంటూ కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో ఈ వీడియోను షేర్ చేసింది.

జైపూర్‌లో కొత్త కాంగ్రెస్ ప్రధాన కార్యాలయ భవనానికి రాహుల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శంకుస్థాపన చేశారు. వేడుకల అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి నాయకులు మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Next Story