రాజ‌స్తాన్‌లో తీవ్ర విషాదం.. బోటు ప్రమాదంలో 14 మంది గల్లంతు

రాజ‌స్తాన్‌లో తీవ్ర విషాదం.. బోటు ప్రమాదంలో 14 మంది గల్లంతు

రాజ‌స్తాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటా జిల్లాలోని చంబ‌ల్‌ న‌దిలో ప‌డ‌వ బోల్తా ప‌డి ఏడుగురు మ‌ర‌ణించారు. 14 మంది గ‌ల్లంత‌య్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ప‌డ‌వ‌లో మొత్తం 25 నుంచి 30మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. పడవ మునిగిన సమయంలో కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకొనిప్రాణాలు రక్షించుకోగా.. మరికొందరు నీటిలో మునిగిపోయారు. వెంటనే అక్కడికిచేరుకున్న రెస్క్యూసిబ్బంది... గల్లంతైనవారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు నదిలో గాలింపు ముమ్మరం చేశారు.

పడవలో పరిమితికి మించి ప్రయాణించడం వల్లనే మునిగిపోయినట్లు స్థానికులు చెపుతున్నారు. పడవలో కొందరు బైక్‌లను తీసుకెళ్లడం వల్లనే అధిక లోడ్ కారణంగా మునిగిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది ఏడుగురు మృతదేహాలను నదినుంచి బయటకు తీశారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గల్లంతైన వారికోసం ప్రత్యేక బృందాలతో నదిని జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్ర సంతాపం తెలిపారు. అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడుసమీక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలకు సీఎం రీలీఫ్ ఫండ్ కింద సహాయం చేస్తామని హామి ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story