దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
దేశ వ్యాప్తంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే, పలువురు కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు లద్దాఖ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడం తోపాటు మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. సోమాజీగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిన్న వయస్సులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన కృషితోనే ఐటీ అభివృద్ధి చెందింద న్నారు రేవంత్ రెడ్డి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com