Uttarakhand: సొరంగం వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..

Uttarakhand: సొరంగం వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
యమునోత్రి జాతీయ రహదారిలో భాగంగా నిర్మాణ దశలో ఉన్న సొరంగం ....40 మంది సేఫ్?

ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయిన విషయం తెలిసిందే. ఇందులో 40 మంది కూలీలు చిక్కుకుపోగా.. వారంతా క్షేమంగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు. లోపలి చిక్కుకున్నవారికి పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు. తాగునీరు కూడా అందజేస్తున్నాఇప్పటివరకు మని, బాధితులతో కాంటాక్ట్ అయ్యామని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్‌‌లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నాయి.


బ్రహ్మకమల్-యమునోత్రి జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 4.5 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగంలో 200 మీటర్లు ఆదివారం ఉదయం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 40 మంది కూలీలు శిథిలాల మధ్య చిక్కుకున్నారు. వారిని ప్రాణాలతో బయటకు తీసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. లోపలి ఉన్న 40 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నారు.. పైపుల ద్వారా ఆక్సిజన్ అందజేస్తున్నాం... బాధితులతో మాట్లాడుతున్నాం అని పేర్కొన్నారు. వారికి కమ్యూనికేషన్ పునరుద్దరించామని, తాగునీరు, ఆహార పదార్ధాలను పంపామని అధికారులు తెలిపారు. సొరంగ ప్రవేశ మార్గం నుంచి 200 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని, ఇప్పటి వరకూ 20 మీటర్ల మేర శ్లాబును తొలగించినట్టు వివరించారు. భారీ యంత్రాలు, ప్రొక్లెయినర్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నామని అన్నారు.

చార్‌ధామ్ రోడ్డు ప్రాజెక్ట్‌లో భాగంగా సిల్కియారాను దండల్‌గావ్‌‌‌తో కలిపేందుకు సొరంగ నిర్మాణం చేపట్టారు. ఈ సొరంగం పూర్తయితే యమునోత్రికి మరో 26 కిలోమీటర్ల దూరంగా తగ్గిపోనుంది. ప్రమాదంపై స్పందించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కరసింగ్ ధామీ.. రెస్క్యూ ఆపరేషన్ గురించి సంక్షిప్తంగా వెల్లడించారు.


ఇదిలావుండగా ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది భారీగా వర్షాలు కురిశాయి. ఈ ప్రభావంతో భవనాలు, రోడ్లు, హైవేలపై ప్రమాదాల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో శివపురి ప్రాంతంలో వరద ప్రవాహం కారణంగా రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు మార్గం ప్రాజెక్ట్‌లో భాగమైన ‘ఎడిట్-II’ అనే సొరంగంలో ఏకంగా 114 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.అప్పుడు తాళ్ల సహాయంతో రెస్క్యూ బృందాలు వీరిని సురక్షితంగాకాపాడాయి.

Tags

Read MoreRead Less
Next Story