Ganga River: గంగానదిలో తేలుతూ వచ్చిన రాయి

Ganga River: గంగానదిలో తేలుతూ వచ్చిన రాయి
చూసేందుకు భారీగా తరలివస్తున్న ప్రజలు

గంగానదిలో తేలుతూ వచ్చిన రాయి రామసేతులోని రాయేనని, ఆ రాయి దొరికిన ప్రాంతం పేరును రామ్‌ఘాట్‌గా మార్చాలని బీహార్‌ రాజధాని పాట్నాలో హడావిడి జరుగుతోంది. ఇక్కడి రాజ్‌ఘాట్ సమీపంలో గంగానదిలో తేలుతూ వస్తున్న రాయిని గమనించిన స్థానికులు ఆశ్చర్యపోయి దానిని బయటకు తీసుకొచ్చారు. రాయిపై ‘శ్రీరామ్’ అని రాసి ఉండడంతో అది ఒకప్పుడు రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన శిలేనని భావిస్తూ ఓ నీటితొట్టెలో ఉంచి పూజలు చేస్తున్నారు. విషయం తెలిసిన జనం ఆ రాయిని చూసేందుకు పోటెత్తుతున్నారు.

రామాయణం ప్రకారం.. శ్రీరాముని సతీమణి సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లి లంకలో బందిస్తాడు. సీతమ్మ కోసం లంకకు బయలుదేరిన రాముడు సముద్రాన్ని దాటాలంటే వారధి కావాలి వారధి నిర్మించే సమయంలో రాళ్లు నీటిలో మునిగిపోయేవట. అప్పుడు రాము సేన అయిన వానరులు బండరాళ్లపై శ్రీరామ అని రాసి సముద్రంలో వేయడం ద్వారా అవి తేలి వారధి నిర్మాణం పూర్తీ అవుతుంది అన్నది భక్తుల నమ్మకం . ఈ వారధి పేరే రామ సేతు. అయితే 2004 సునామీ సమయంలో రామసేతు నిర్మాణంలో ఉన్న కొన్నిరాళ్లు రామేశ్వరం ప్రాంతంలో కనిపించాయని చెబుతుంటారు. అప్పటి నుంచి నీటిలో తేలే రాళ్లు కనిపిస్తే భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.


తాజాగా బీహార్ రాష్ట్రంలో పాట్నాలోని గంగా నదిలో దొరికిన రాయి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఈ రాయిపై శ్రీరామ్ అని ఉండటంతో స్థానిక ప్రజలు రాయిని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. రాయికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గంగానదిలో రాళ్లు తేలియాడుతూ కొట్టుకురావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ మూడురాళ్లు లభ్యమయ్యాయి. వాటిలో ఒకటి పాట్నాలోని హనుమాన్ ఆలయంలో, మరోటి విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో, ఇంకోటి పాట్నాలోని పఠాన్‌దేవి ఆలయంలో ప్రతిష్ఠించారు. తాజాగా కనిపించిన రాయి నాలుగోది.

అయితే తేలియాడుతూ వచ్చిన రాయి బరువు మొదట 9 కిలోలు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. తర్వాత మరోమారు దానిని తూకం వేస్తే 14 కిలోలకు పెరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత బరువున్న నీళ్లలో వేస్తే మాత్రం అది తేలుతోందని చెప్పారు. గతంలో ఇదే ఘాట్‌లో బంగారు రంగు తాబేలు కనిపించిందని, దానిని తిరిగి నదిలోనే విడిచిపెట్టామని అంటున్నారు.


Tags

Read MoreRead Less
Next Story