MP Faisal: లక్షద్వీప్‌ ఎంపీకి సుప్రీంలో చుక్కెదురు

MP Faisal: లక్షద్వీప్‌ ఎంపీకి సుప్రీంలో చుక్కెదురు
హైకోర్టు తీర్పును పక్కనబెట్టిన సుప్రీంకోర్టు

లక్షద్వీప్‌ ఎన్సీపీ లోక్‌సభ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హత్యాయత్నం కేసులో కరవత్తి సెషన్స్‌ కోర్టు ఆయనకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా... దాన్ని కేరళ హైకోర్టు నిలిపివేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. ఈ కేసును కొత్తగా మళ్లీ పరిశీలించాలంటూ కేరళ హైకోర్టును ఆదేశిస్తూ ఆరువారాల గడువు ఇచ్చింది.

సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో ఆరువారాల గడువులోగా లక్షద్వీప్ పరిపాలన విభాగం అప్పీల్‌ను హైకోర్టు కొత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ కేసులో ఫైజల్‌ ఎంపీ అనే అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం, మిగతా విషయాలను విస్మరించడం ద్వారా హైకోర్టు తప్పు విధానాన్ని అనుసరించిందని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. మాజీ కేంద్ర మంత్రి పీఎం సయ్యిద్‌ అల్లుడు మహ్మద్‌ సాలిహ్‌ను హత్య చేయడానికి ప్రయత్నించినట్టు మహ్మద్‌ ఫైజల్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు 2016, జనవరి 5వ తేదీన ఫైజల్‌పై అండ్రోథ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్‌సభ ఎంపీగా నెగ్గారు.అయితే కవరత్తి కోర్టు 2023 జనవరి 11న ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో మొహమ్మద్ పార్లమెంట్ సభ్యత్వాన్ని జనవరి 1న లోక్‌సభ సచివాలయం రద్దు చేస్తూ.. అనర్హుడిగా ప్రకటించింది. అయితే, కింది కోర్టు తీర్పుపై ఫైజరల్ కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించింది.


ఆ ఆదేశాలపై ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. అది తప్పుడు కేసు అని, ఫైజల్‌ను నిర్దోషిగా తేలుస్తూ, లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అంశం పరిశీలించమని లోక్‌సభ సెక్రటేరియట్‌కు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సభ్యత్వం పునరుద్ధరణ అంశంలో లోక్‌సభ సెక్రటేరియేట్‌ మాత్రం జాప్యం చేసినా.. చివరకు మార్చి 29వ తేదీన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోట్‌ విడుదల చేసింది.

అయితే హైకోర్టు ఆదేశాలను లక్షద్వీప్ పరిపాలన యంత్రాంగం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఫైజల్‌కు ఉపశమనం ఇవ్వడం.. న్యాయ ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయటం అని లక్షద్వీప్‌ రిపాలన విభాగం వాదించింది. సాలిహ్‌పై ఉద్దేశపూర్వకంగానే ఫైజల్‌తో పాటు మరికొందరు మారణాయుధాలతో దాడి చేశారని, ఈ కేసులో మొత్తం 37 మంది నిందితులను చేర్చగా.. ఇద్దరు విచారణ సమయంలో మరణించారని లక్షద్వీప్‌ పరిపాలన విభాగం సుప్రీంకు నివేదించింది. చివరకు 35లో కేవలం నలుగురిని మాత్రమే దోషులుగా నిర్ధారించిన కవరత్తి కోర్టు.. పదేళ్ల కఠినకారాగార శిక్ష విధిస్తూ మిగిలిన వాళ్లను నిర్దోషులుగా ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story