Modi: 7200 వజ్రాలతో ప్రధాని ఫోటో..

Modi: 7200 వజ్రాలతో ప్రధాని ఫోటో..
అరుదైన గిఫ్ట్ ఇవ్వబోతున్న అభిమాని..

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న క్రెజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఆలోచనలు, నియమాల వల్ల కొందరు ఆయనకు వీరాభిమానులుగా మారారు.. దేశ, విదేశాల్లో కూడా ఉన్న ఆయన అభిమానులు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. ఆయన పై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిమానాన్ని చాటుకుంటారు. మోదీకి అనేకమంది అభిమానులు ఎన్నో సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్ ఇచ్చే ఉంటారు. తాజాగా మోదీ వీరాభిమాని అతనికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అది అత్యంత ఖరీదైన గిఫ్ట్.

ఏకంగా 7200 వజ్రాలతో ప్రధాని ఫొటో తయారుచేశాడు. మోదీకి ఈ అరుదైన గిఫ్ట్ ను అభిమాని ఇవ్వబోతున్నాడు. సెప్టెంబర్ 17న మోదీ తన పుట్టినరోజుని జరుపుకోనున్నారు. ఈ పుట్టినరోజు మోదీ 73వ పుట్టినరోజు బర్త్ డే సందర్బంగా మోదీకి ఒక అభిమాని అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్నాడు.


సూరత్‌కి చెందిన విపుల్ జేపీవాలా అనే వ్యక్తి మోదీకి వీరాభిమాని. అతను ఒక అర్కిటేక్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.. అలాగే కొద్దికాలంగా వజ్రాలతో పెయింటింగ్ లు వేయడం ప్రారంభించాడు. అందులో భాగంగా దాదాపు మూడున్నర నెలలు కష్టపడి మోదీ చిత్రపటాన్ని తయారుచేశాడు. మూడు వేర్వేరు రంగుల వజ్రాలను ఈ ఫొటో తయారుచేయడానికి వాడాడు.. మోదీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు జొబైడెన్ భార్యకు వజ్రాలు పొదిగిన క్రాఫ్ట్ ను బహుమతిగా ఇచ్చాడు. దానిని చూసి తర్వాత ప్రధాని మోదీ ఫొటోలను రూపొందించాలనే ఆలోచన వచ్చినట్లు ఈ అభిమాని చెబుతున్నాడు.. ఈ వజ్రాలు ఎప్పటికి ఊడిపోకుండా ప్రత్యేకమైన గమ్ తో అతికించాడు..అంతేకాదు ఎక్కువకాలం చిత్రపటం నుంచి విడిపోకుండా ఉండేలా వజ్రాలను ఎంచుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story