UP: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 89 మంది బాలికలు మిస్సింగ్

UP: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో 89 మంది బాలికలు మిస్సింగ్
ఆకస్మిక తనిఖీలలో బయటపడిన అలసత్వం

ఉత్తరప్రదేశ్ లోని ఓ హాస్టల్ ను రాత్రి పూట తనిఖీలు చేసిన అధికారులు అవాక్కయారు. రికార్డులో ఉన్న దానికి తాము చూస్తున్న దానికి ఉన్న తేడాకివారు షాక్ అయ్యారు.. ఎందుకంటే ఇక్కడ రికార్డుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 100 కాగా.. కళ్ళ ముందు కనబడుతున్నది 11 మంది మాత్రమే..

ఉత్తరప్రదేశ్ లోని పరస్‌పూర్‌లోని కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో మొత్తం 89 మంది బాలికలు అదృశ్యమయ్యారు. అక్కడ 100 మంది బాలికలు ఉన్నట్టు రికార్డలలో ఉండగా.. 11 మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నారు. దీంతో వార్డెన్‌తో సహా నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాత్రి జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ఈ విషయం బయటపడింది.

కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 89 మంది బాలికల మిస్సింగ్ పై వార్డెన్ సరితా సింగ్‌ సమాధానం చేయలేకపోయింది. ఇది తీవ్ర నిర్లక్ష్యం అని, రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలు ఈ పద్ధతిలో నడపకూడదు అని DM మండిపడ్డారు. వార్డెన్ సరితా సింగ్‌పై కూడా FIR నమోదు చేస్తామని తెలిపారు.

జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు పాఠశాల వార్డెన్, ఫుల్‌టైమ్ టీచర్, వాచ్‌మెన్, ప్రాంతీయ రక్షా దళ్ (పీఆర్‌డీ) జవాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు జిల్లా ప్రాథమిక శిక్షా అధికారి తెలిపారు. మరోవైపు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు. విధుల్లో ఉన్న గార్డుపై శాఖాపరమైన చర్యల కోసం జిల్లా యువజన సంక్షేమ అధికారికి ప్రత్యేక లేఖ రాయడం జరిగిందని తెలిపారు. వీరంతా కనబడకుండా పోయారా గైర్హాజరయ్యారా అన్న విషయం కనీసం వార్డెన్ కి తెలియకపోవటం ఆందోళనకరమన్నారు. దేశంలో మహిళలపై క్రైమ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి విషయంలో అలసత్వం పనికిరాదు న్న అభిప్రాయం వెల్లడి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story