Taj Mahal : తాజ్ ను కమ్మేసిన కాలుష్యం

Taj Mahal : తాజ్ ను కమ్మేసిన కాలుష్యం
కాలుష్య కోరల్లో చిక్కుకున్న ప్రేమ చిహ్నం

ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ కాలుష్యం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్‌మహల్‌ను కమ్మేసింది. కాలుష్య కోరల్లో చిక్కుకుని వెలవెలబోతుంది. పొగమంచుతో పాటు కాలుష్యంలో చిక్కుకున్న ప్రేమ చిహ్నం మసకబారిపోతోంది. తాజ్‌మహల్‌కు కాలుష్యం కమ్మేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు దారుణంగా మండిపడుతున్నారు.

ఢిల్లీలో అంతకంతకు పెరుగుతున్న కాలుష్యం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్ మహల్ ను కమ్మేసింది. ధవరణ వర్ణంలో మెరిసిపోయే తాజ్ మహల్కాలుష్య కోరల్లో చిక్కుకుని వెలవెలబోతోంది. పొగమంచుతో పాటు కాలుష్యంలో చిక్కుకున్న ప్రేమ చిహ్నం మసకబారిపోతోంది. అంతకంతకు తన ప్రాభవాన్ని కోల్పోతోంది. ప్రేమకు ప్రతిరూప నిలిచిన గొప్ప కట్టడం ఇలా కాలుష్య కోరల్లో చిక్కుకుని అంతకంతకు ప్రాభవాన్ని కోల్పోతుండటం విచారించాల్సిన విషయమని పర్యాటకులు వాపోతున్నారు.

ఈ ఏడాది కూడా ఢిల్లీని కాలుష్యం కమ్మేయటంతో ఆ ప్రభావం ఆగ్రాలో కొలువైన ప్రేమ చిహ్నాన్ని కూడా కప్పేస్తోంది. ఫలితంగా తాజ్ మహల్ వెలుగులు అంతకంతకు కోల్పోతోంది. ఢిల్లీ పరిసరాల్లో కాలుష్య నగరంతో పాటు పలు చారిత్రాత్మక కట్టడాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఫలితంగా వాటి ప్రాభావాలను కోల్పోయేలా చేస్తోంది. తాజ్ మహల్ అంటే వాహ్ తాజ్ అంటూ మురిసిపోయే తాజ్ ప్రేమికులు మాత్రం కాలుష్యం కప్పేసినా పొగమంచు కమ్మేసినా దాని అందాన్ని మాత్రం ఆస్వాదిస్తున్నారు.

అంతకంతకు పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టే ప్రయత్నంలో భాగంగా..ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ ఢిల్లీ ప్రభుత్వంతో చేతులు కలిపి పలు హాట్‌స్పాట్‌లలో నీటిని పిచికారీ చేస్తోంది. “కాలుష్యాన్ని అరికట్టేందుకు మొత్తం 12 అగ్నిమాపక యంత్రాలు పనిచేస్తున్నాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన వివరాల ప్రకారం..ఆదివారం (నవంబర్ 5,2023) ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 457పైగా నమోదు అయింది.

వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రెండేళ్ల క్రితం కన్నాట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పెద్ద స్మోగ్ టవర్ ఆపరేషన్‌ను నిలిపివేసినందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ ఛైర్మన్ అశ్వనీ కుమార్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శనివారం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జ్ అన్వర్ అలీపై కూడా క్రమశిక్షణా చర్య తీసుకోవాలని రాయ్ కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఢిల్లీలో డిపిసిసి ఆధ్వర్యంలో కన్నాట్ ప్రాంతం, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలోని ఆనంద్ విహార్‌లో రెండు స్మోగ్ టవర్‌లను ఏర్పాటు చేసినట్లు రాయ్ పేర్కొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story