Inter-Student Suicide : కాలేజీ వేధింపులు భరించలేక ఆత్మహత్య

Inter-Student Suicide : కాలేజీ వేధింపులు భరించలేక ఆత్మహత్య
ఎక్కువ మార్కులు రావాలని టీచర్స్ టార్చర్ చేసేవారంటూ విద్యార్థి లేఖలో వెల్లడి

రంగారెడ్డి జిల్లాలో అక్టోబర్ 31న ఉదయం ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాలేజీ అధికారుల వేధింపులు భరించలేక విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టాడని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.

“వైభవ్ అనే ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థి తన ఇంటి వద్ద ఉరి వేసుకుని కనిపించాడు. ఈ సంఘటన ఈరోజు ఉదయం జరిగింది. కాలేజీ అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు అని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్, సుధాకర్ తెలిపారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించనున్నట్లు చెప్పారు. ఎక్కువ మార్కులు రావాలని విద్యార్థిని కళాశాల అధికారులు ముఖ్యంగా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్ ఒత్తిడి చేస్తున్నారని మృతుడు రాసిన లేఖలో ఉంది.

లేఖలో, విద్యార్థి తన సోదరుడిని అదే కళాశాలకు పంపవద్దని తల్లిదండ్రులను కోరాడు. విద్యార్థులపై ఒత్తిడి చేయవద్దని కళాశాల అధికారులను విజ్ఞప్తి చేశాడు. ఈ కేసుపై పోలీసులు కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు. ఈ నెల ప్రారంభంలో, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హాస్టల్ గదిలో తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన నాల్గవ సంవత్సరం విద్యార్థి ఉరి వేసుకున్నాడు.


Tags

Read MoreRead Less
Next Story