Girish Chandra Yadav: మంత్రిని కొరికిన ఎలుక.. నిద్రమత్తులో పాము అనుకొని..

Girish Chandra Yadav: మంత్రిని కొరికిన ఎలుక.. నిద్రమత్తులో పాము అనుకొని..
Girish Chandra Yadav: నిద్రలో ఉండగా తనను ఏదో కొరికినట్టుగా అనిపించగానే అది పామే అనుకున్నారు గిరీశ్చంద్ర.

Girish Chandra Yadav: ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ఘటన జరిగింది. మంత్రి గిరీశ్చంద్ర యాద‌వ్‌ బాందాలో పర్యటనలో ఉన్నారు. ఆయన రెండురోజులుగా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అక్కడ పర్యటన పూర్తిచేసుకున్న ఆయన.. విశ్రాంతి భవనంలో నిద్రిస్తూ ఉండగా తనకు ఏదో కొరికినట్టుగా అనిపించింది. నిద్రమత్తులో ఆయన కొరికింది పాము అనుకొని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు.

బాందా అంటే అటవీ ప్రాంతం. అక్కడ పాములు లాంటివి తిరగడం సహజం. అందుకే నిద్రలో ఉండగా తనను ఏదో కొరికినట్టుగా అనిపించగానే అది పామే అనుకున్నారు గిరీశ్చంద్ర. ఈ విషయాన్ని అధికారులకు తెలుపగా.. వారు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎలుక కొరికిందని నిర్ధారించారు.

మంత్రికి వైద్యం చేసిన డాక్టర్ మాట్లాడుతూ.. ఆయన తెల్లవారుజామున 3 గంటలకు లేచి చూసేసరికి తన కుడిచేతిపై గాటు కనిపించిందని, అది కూడా ఆయన పాము అనుకున్నారని తెలిపారు. పైగా బాందా అటవీ ప్రాంతం కావడంతో ఆయన మరింత భయపడ్డారని అన్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత అది ఎలుక అని పాము కాదని తెలిందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story