Uttarakhand : వర్షాలు, వరదలతో రాష్ట్రానికి 1000 కోట్ల నష్టం

Uttarakhand :  వర్షాలు, వరదలతో రాష్ట్రానికి 1000 కోట్ల నష్టం
మరో నాలుగు రోజుల వరకు కొనసాగనున్న భారీ వర్షాలు

భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ లో జన జీవనం అతలాకుతలం అయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే కొండచరియలు విరిగిపడి చాలా మంది వరకు చనిపోయారు. ఈరోజు కూడా ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రాష్ట్రంలో 406 రోడ్లు మూసుకుపోగా, 52 మంది మృతి చెందారు మరో 37మంది గాయపడ్డారు.

రుతుపవనాలు, భారీ వర్షాలు ఇక్కడి పంటలను నాశనం చేశాయి, రోడ్లు, వంతెనలు, ఇళ్ళు, పశువుల కొట్టాలు కొట్టుకుపోయాయి. అనేక మంది ప్రజలు, పశువుల ప్రాణాలను బలిగొన్నాయి. మరోవైపు అధిక వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో విపత్తు లాంటి పరిస్థితి నెలకొందని, ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం చెప్పారు.


ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వర్షాల పరిస్థితిని సమీక్షించిన అనంతరం ధామి విలేకరులతో మాట్లాడారు. రోడ్లు, వంతెనలు, ఇళ్ళు మరియు గోశాలలు కొట్టుకుపోయాయని తెలిపారు. అంతేకాకుండా అనేక మంది ప్రజలు, పశువుల ప్రాణాలను కూడా బలిగొన్నాయని ఆయన పేర్కొన్నారు.

రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయని.. అంతేకాకుండా ఇప్పటికీ ఇంకా రాష్ట్రంలో వర్షాలు భారీగానే కురుస్తున్నాయని పుష్కర్ చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన బృందం ఇప్పటికే ప్రాథమిక సర్వే చేసిందని, విపత్తు వల్ల సంభవించిన నష్టాలను సమగ్రంగా అంచనా వేస్తుందని తెలిపారు.


ఉత్తరాఖండ్‌లో వర్షాల వల్ల సంభవించిన విపత్తులలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు, బాధిత ప్రజలకు పునరావాసం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక పథకాన్ని ప్రవేశపెడుతుందని ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లోని నగరాల్లో పెరుగుతున్న పర్యాటకుల లోడ్‌కు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ, రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఇప్పటికే దాని ప్రధాన పర్యాటక పట్టణాల భారాన్ని మోసే సామర్థ్యాన్ని అధ్యయనం చేసే పనిలో ఉందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story