Ganesh Temple : రూ. 65 లక్షల విలువైన కరెన్సీతో ఆలయం

Ganesh Temple : రూ. 65 లక్షల విలువైన కరెన్సీతో ఆలయం
రూ.10 నుంచి రూ.500వరకు.. కరెన్సీ నోట్లతో గణేష్ ఆలయం

గణేష్ చతుర్థి పండుగకు ముందు, కర్ణాటకలోని బెంగళూరులో ఒక ఆలయాన్ని రూ. 65 లక్షల విలువైన కరెన్సీ నోట్లు, నాణేలతో అలంకరించారు. బెంగళూరులోని జేపీ నగర్‌లోని శ్రీ సత్య గణపతి దేవాలయంలో ప్రతి సంవత్సరం గణేష్ పూజ ఉత్సవాల సమయంలో వారి ప్రాంగణానికి ప్రత్యేకమైన టచ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈసారి, వారు ఒక అడుగు ముందుకేసి, వందలాది నాణేలు, రూ. 10, రూ. 20, రూ. 50 నుండి రూ. 500 డినామినేషన్ల వరకు కరెన్సీ నోట్లను ఉపయోగించి ఆలయాన్ని అలంకరించారు.

గత కొన్ని సంవత్సరాలలో, గణపతి చతుర్థి ఉత్సవాల్లో భాగంగా గణపతి విగ్రహాన్ని అలంకరించేందుకు ఆలయంలో పువ్వులు, మొక్కజొన్న, పచ్చి అరటిపండ్లు వంటి పర్యావరణ అనుకూల వస్తువులను కూడా ఉపయోగించారు.

గణేష్ చతుర్థి 2023

గణేష్ చతుర్థి పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో వస్తుంది. శివుడు, పార్వతిల కుమారుడు గణేశుడి పుట్టినరోజును ఈ పండుగ సూచిస్తుంది. పెద్దలతో పాటు పిల్లలూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఈ పండుగను వినాయక చతుర్థి లేదా గణేషోత్సవ్ అని కూడా అంటారు. ఈ రోజున గృహాలు, బహిరంగ ప్రదేశాల్లో గణేశుని మట్టి విగ్రహాలను ప్రతిష్టించి, భక్తి, శ్రద్దలతో పూజిస్తారు. అనంత చతుర్దశి రోజున విగ్రహాన్ని బహిరంగ ఊరేగింపు ద్వారా తీసుకువెళ్లి నది లేదా సముద్రంలో నిమజ్జనం చేయడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 19నుంచి గణేష్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story