Ayodhya: రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సచిన్, కోహ్లీ, అమితాబ్‌…

Ayodhya: రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు  సచిన్,  కోహ్లీ, అమితాబ్‌…
8వేలమంది ప్రముఖులకు ఆహ్వానం

అయోధ్య రామ మందరి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు దేశవ్యాప్తంగా 8వేల మంది ప్రముఖులను ఆహ్వానించారు. ప్రముఖ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ సినీనటులు,అమితాబ్ బచ్చన్ , అక్షయ్ కుమార్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, రతన్ టాటాలకు శ్రీ రామజన్మభూమి తీర్థ కేత్ర నిర్వాహకులు ఆహ్వానాలు పంపించారు. 2024వ సంవత్సరం జనవరిలో అయోధ్యలో రామమందిరం సిద్ధమవుతుందని భావిస్తున్నారు. జనవరి 22వతేదీన ఆలయంలో రామ్ లల్లా విగ్రహానికి ప్రతిష్ఠాపన తేదీగా నిర్ధారించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు హాజరుకానున్నారు.ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22వతేదీన నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామమందిర ప్రతిష్ఠాపన వేడుకలను పండుగలా జరుపుకుంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ చెప్పారు.


మరోవైపు బుధవారం బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా అయోధ్య నగరంలో భారీ సాయుధ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. 1992వ సంవత్సరం డిసెంబరు 6వతేదీన బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ హింసాకాండలో వెయ్యిమంది మరణించారు. అయోధ్య నగరానికి వెళ్లే వారిని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి వారి గుర్తింపు కార్డులను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయోధ్యలోని పలు ప్రాంతాల్లో పోలీసులు వాహనాల తనిఖీలను కూడా ముమ్మరం చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా ప్రజలు ఎలాంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని అయోధ్య ఎస్పీ రాజ్ కరణ్ నయ్యర్ సూచించారు. అయోధ్య జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగాన్ని మోహరించారు. సమీప జిల్లాల నుంచి పోలీసు బలగాలను కూడా అయోధ్యకు రప్పించారు.

Tags

Read MoreRead Less
Next Story