Manipur : పాఠశాల బయట మహిళ హత్య

Manipur : పాఠశాల బయట మహిళ హత్య
నిన్న తెరుచుకున్న పాఠశాలలు, ఈరోజు హత్య, భయంతో విద్యార్థులు.

మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఒక స్కూల్‌ వెలుపల మహిళను గన్‌తో కాల్చి చంపారు. పశ్చిమ ఇంఫాల్‌లో జరిగిన ఈ సంఘటన పలువురిని భయాందోళనలకు గురి చేసింది.

రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో కొనసాగుతున్న అల్లర్లు తగ్గుముఖం పట్టలేదు. రాష్ట్ర ప్రజలంతా సాయుధ దళాల మధ్యలోనే జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. ఇక పాఠశాలలు ఇదివరకే తెరవాల్సి ఉండగా రాష్ట్రంలో ఉద్రిక్తత తగ్గని నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగించారు. సుదీర్ఘ విరామం తర్వాత జులై 5న పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. అయితే తల్లిదండ్రులు పిల్లలను పంపించడానికి భయంతో వెనకడుగు వేశారు. దీంతో మొదటి రోజున విద్యార్థుల హాజరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇక ఈ రెండవ రోజు ఉదయం శిశు నిష్ఠా నికేతన్ పాఠశాల బయట ఉన్న మహిళపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆమె మరణించింది. చనిపోయిన మహిళ వివరాలతోపాటు హంతకులు వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపాయి పోలీసు వర్గాలు.

మరోవైపు కాంగ్‌పోక్‌పి జిల్లాలోని మాపావో, అవాంగ్ సెక్మై ప్రాంతాలకు చెందిన రెండు సాయుధ గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. భద్రతా బలగాలు ఈ ఘర్షణను నివారించాయి.

Tags

Read MoreRead Less
Next Story