పారిశ్రామిక వేత్తలను ఎవరూ బెదిరించలేదు: యోగీ ఆదిత్యనాథ్

పారిశ్రామిక వేత్తలను ఎవరూ బెదిరించలేదు: యోగీ ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ లో ఏ క్రిమినల్ కూడా పారిశ్రామిక వేత్తను బెదిరించే పరిస్థితి లేదని అన్నారు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్. "ప్రొఫెషనల్ క్రిమినల్స్ గాని, మాఫియాగాని ఏ పారిశ్రామికవేత్తను ఫోన్‌లో బెదిరించలేరు. 2012, 2017 మధ్య ఉత్తర ప్రదేశ్ లో 700 కంటే ఎక్కువ అల్లర్లు జరిగాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ( 2017, 2023 మధ్య) యుపిలో అల్లర్లు చెలరేగలేదు, కర్ఫ్యూ విధించలేదు. పెట్టుబడి పెట్టడానికి, పరిశ్రమల స్థాపనకు ఇది అత్యంత అనుకూలమైన అవకాశం" అని యోగీ చెప్పారు. అతిక్ అహ్మద్ హత్య నేపథ్యంలో యోగీ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Next Story