విశాఖ కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల జేఏసీ ఆందోళన

విశాఖ కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల జేఏసీ ఆందోళన

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల జేఏసీ ఆందోళన చేపట్టింది.. సీపీఎస్‌ రద్దు చేయాలంటూ నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు.. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని, సీపీఎస్‌, సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని వారు మండిపడ్డారు.. పాదయాత్రలో సీఎం జగన్‌ హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఆ హామీ ఏమైందని వారు ప్రశ్నించారు.. తమ సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Next Story