By - Chitralekha |19 April 2023 9:29 AM GMT
ప్రముఖ గాయని ఆశాభోంస్లేకు లతా మంగేష్కర్ పురస్కార ప్రదానం చేయాలని జ్యూరీ నిర్ణయించింది. ఇటీవలే కాలం చేసిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పేరిట కుటుంబ సభ్యులు ట్రస్టు, అవార్డును ఏర్పాటు చేశారు. జాతి నిర్మాణంలో మార్గదర్శక పాత్ర పోషించిన ప్రముఖులకు ఈ అవార్డు ఇవ్వనున్నారు. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ ఏడాది లతాకు స్వయానా సోదరి అయిన ఆశాభోంస్లేకు ఏప్రిల్ 24న ఈ పురస్కారం అందజేయనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com