చందనోత్సవానికి భారీ ఏర్పాట్లు...

చందనోత్సవానికి భారీ ఏర్పాట్లు...

సింహాచలం లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవానికి అంగరంగవైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడాది పొడవునా.. సుగంధ భరిత చందనంలో కొలువుండే సింహాద్రినాథుడు ఒక్క వైశాఖ శుధ్ద తదియనాడు.. మాత్రమే తన నిజ రూప దర్శనాన్ని ఇస్తాడు. దీనినే భక్తులంతా చందోనోత్సవంగాను, చందన యాత్రగానూ పిలుస్తారు. స్వామి వారి నిజరూప దర్శనం కోసం.. లక్షలాది మంది వస్తారన్న అంచనాతో... భారీ ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారలు. ఉత్తరాంధ్ర తో పాటు తెలుగు రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవానికి హాజరవుతారు.


Next Story