By - Subba Reddy |2 May 2023 5:15 AM GMT
తీహార్ జైలులో గ్యాంగ్ వార్ జరిగింది. ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో ఢిల్లీలోని రోహిణి కోర్టు కాల్పుల ఘటనలో నిందితుడిగా ఉన్న టిల్లు తాజ్పురియాను ప్రత్యర్థి యోగేష్ తుండా కొట్టి చంపాడు. జైలు సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే జైలు నుంచి ఆస్పత్రికి తరలించే లోపే టిల్లు తాజ్పురియా మృతి చెందాడు. అటు ఖైదీల మధ్య ఘర్షణపై జైలు అధికారులు విచారణకు ఆదేశించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com